కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీలు రోజుకో రకమైన ప్రశ్నతో మంత్రులకు ఇబ్బందులను కొనితెచ్చిపెడుతున్నారు. ఆయన ప్రకటనలతో అటు కేంద్రంలోని ప్రభుత్వమే కాదు ఇటు దేశప్రజలు కూడా బెంబేలెత్తిస్తున్నారు. మొన్నటికి మొన్న ధూమపానం వల్ల కేన్సర్ వస్తుందని విదేశాలకు చెందిన పరిశోదనలే తేల్చాయని, దీనిపై ఎలాంటి స్పష్టత లేదని, భారతీయ వైద్యశాస్త్రవేత్తులు ఎవరూ దీనిని నిరూపించలేదని ఇటీవలబీజేపీ ఎంపీ, పొగాకు నిషేధం విధివిధానాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు దిలీప్ గాంధీ వ్యాఖ్యానించి వార్తలకెక్కారు.
తాజాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఆయనకు మద్దతు పలికారు. పొగాకు వినియోగానికి మద్దతు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మధుమేహ వ్యాధిని కలుగజేసే చక్కెరపై నిషేధం లేనప్పుడు, క్యాన్సర్ కారకమని పొగాకును ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. చక్కెర కన్నా బీడీలు అంత ప్రమాదకరం కాదని తేల్చిచెప్పారు. అయితే ఈ ఎంపీకి ఏదో అందరిలా సాధారణ ఎంపీ మాత్రే కాదు. కొన్ని వందల కోట్ల టర్నోవర్ గల సిగరెట్, బీడీ వ్యాపారాలకు అధిపతి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికల బోమ్మలను 40 శాతం నుంచి 85 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం మింగుడు పడక, సోంత పార్టీనే టార్గెట్ చేశారు. పొగాకు నిషేధం విధివిధానాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు కూడా. అందుకే పొగాకు వినియోగానికి మద్దతు పలుకుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more