గుజరాత్ అసెంబ్లీ మరోసారి వివాదాస్పద యాంటీ టెర్రరిజం బిల్లును ఆమోదించింది. బిల్లు చట్ట రూపం రావడానికి రాష్ట్రపతికి పంపిచింది గుజరాత్ అసెంబ్లీ. అయితే గుజరాత్ ఇలా ఇదే బిల్లును రాష్ట్రపతికి గతంలో మూడు సార్లు పంపించింది. కానీ రెండు సార్లు బిల్ తిరస్కరించగా, 2009లో పంపిన బిల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. గతంలో 2004 లో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, 2008లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఈ బిల్ ను రాష్ట్రపతి పరిశీలన కు పంపింది. అయితే వివాదాస్సదంగా బిల్లులోని సెక్షన్ 14, 20 ల కింద చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మరో సారి ఆనంది బెన్ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతి పరిశీలనకు బిల్ ను పంపింది.
గుజరాత్ అసెంబ్లీలో బిల్ ను ప్రతిపాదిస్తు రజినీకాంత్ పాటిల్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. గుజరాత్ కంట్రోలర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ బిల్ 2015 ను గుజరాత్ అసెంబ్లీ ఏకపక్షంగా పాస్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రజా సంక్షేమం కోసం గుజరాత్ ప్రభుత్వం కొత్తగా బిల్లులో కొన్ని మార్పులను చేసి మరీ బిల్ ను తీసుకువచ్చిందని అధికారపక్షం అంటోంది. అయితే కీలకమైన సెక్షన్ 14, సెక్షన్ 20లలో ఎలాంటి మార్పులు చెయ్యకుండా మిగిలిన వాటిలో మాత్రమే మార్పులు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ బిల్ గనక చట్ట రూపం దాలిస్తే, చట్టం ద్వారా అరెస్టు కాబడిన వ్యక్తి 180 రోజుల వరకు బెయిల్ పొందడానికి అవకాశం ఉండదు. నిందుతులుగా అరెస్టయిన వారు కేవలం ఎస్పీ స్థాయి వ్యక్తుల ముందు మాత్రమే వాంగ్మూలం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది,. సెక్షన్ 20(4) ప్రకారం స్వంతంగా పూచీకత్తుపై విడుదలకు అనుమతి లభించదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి లేకుండా బెయిల్ ఇవ్వడం కుదరదు. ఇలా చట్టంలో ఉన్న లోపాలను గతంలో రాష్ట్రపతులు కూడా ప్రశ్నించారు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దానికి వేరే కారణాలను చెబుతోంది. మరి కనీసం ఈ సారైనా యాంటీ టెర్రరిజం బిల్ చట్టంగా మారుతుందో లేదో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more