పన్ను ఎగవేతగాళ్లపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సరికొత్త పంథాలో కొరడా దెబ్బ కొట్టింది. ఇన్నాళ్లూ పన్ను కట్టకుండా తాపీగా వున్న కొన్ని కంపెనీల పరువు బజారులో కలిసిపోయేలా కొత్త విధానాన్ని అవలంభించింది. ఇటీవలే పన్ను ఎగ్గొట్టిన కొన్ని కంపెనీలకు ఐటీ నోటీసులు పంపించింది. ‘పన్ను కట్టనివారి పేర్లను వెల్లడిస్తాం.. పరువు పోతుందని భావిస్తే వెంటనే పన్ను కట్టండి’ అంటూ గతంలో హెచ్చరించినప్పటికీ.. సదరు కంపెనీలు ఐటీ శాఖలో తమ పన్ను కట్టలేదు కదా.. కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో ఎటువంటి పట్టింపులు లేకుండా చివరికి ఆదాయపు పన్ను శాఖ తన విధానాన్ని అనుసరించింది.
ఐటీ శాఖ ప్రస్తుతానికి రూ. 10 కోట్లకుపైగా పన్ను కట్టాల్సిన 18 మంది పన్ను ఎగవేతదార్ల పేర్లను, వివరాలను విడుదల చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో కేవలం ఒక్క గుజరాత్కు చెందిన సంస్థలే 11 ఉండటం గమనార్హం. ఇండియాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గుజరాత్.. అవినీతిలోనూ మొదటి స్థానంలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో సోమానీ సిమెంటు (27 కోట్లు), బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (75 కోట్లు), యాపిల్ టెక్ సొల్యూషన్స్ (27 కోట్లు), గోల్డ్సుఖ్ ట్రేడ్ ఇండియా (75 కోట్లు), జూపిటర్ బిజినెస్ (రూ. 21 కోట్ల) తదితర బడాసంస్థలు వున్నాయి. వీరంతా కలిసి దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయ పన్నును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది.
పన్ను ఎగవేతదార్ల పేర్లను ఆదాయ పన్ను విభాగం తన వెబ్సైట్లో గతంలోనే ఉంచింది. అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఇలా బహిర్గతం చేసింది. ఇదే విషయమై ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ... ‘పన్ను ఎగ్గొట్టిన కొందరిని ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కష్టంగా ఉంది. వారందరికీ నోటీసులు పంపినప్పటికీ ఎటువంటి సమాధానం అందలేదు. అందుకే ఇలా పేర్లు వెల్లడించాల్సి వచ్చింది’ అని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more