మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే! అయితే.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. అదేమిటంటే.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సోనియాగాంధీ.. ఆ పదవిని సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్న నేతగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు.
1997లో కోల్కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. అలా సభ్యత్వం తీసుకొన్న కేవలం 62 రోజులకే 1998లో ఆమె పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొదట 1999లో కర్నాటకలోని బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేశారు. బళ్ళారిలో సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ను ఓడించారు. అదే సంవత్సరం ఆమె 13వ లోక్ భకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004, 2009,2014 సంవత్సరాలలో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
అయితే.. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అతి తక్కువ మెజారిటీతో గెలుపొందింది. ఇదిలావుండగా.. సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలను ఈ ఏడాది వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే నెలలోనే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more