క్రీయాశీలక రాజకీయ బాధ్యతల నుంచి తాత్కాలిక సెలవు తీసుకుని నెల రోజుల క్రితం వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్ ప్రదేశ్ లో పోస్టర్లు విడుదలయ్యాయి. ఆయన తప్పిపోయాడంటూ ఉత్తరప్రదేశ్లోని బాలందర్ష , అలహాబాద్ లతో పాటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. రాహుల్ తప్పిపోయారు.. రాహుల్ ఆచూకీ తెలిపిన, గుర్తించిన వారికి రివార్డులు కూడా ఇస్తాం అంటూ వాటిల్లో ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గం ఆమేథిలో కూడా ఇవి కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అత్యంత ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలను వదులుకుని రాహుల్ గాంధీ.. సెలవుపై వెళ్లడంతో విమర్శలు వినబడుతున్నాయి. ఒక పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వుంటూ.. బాధ్యతలను భుజస్కంధాలపై దించేయడం.. కీలక సమావేశాల సమయంలో సెలవుపై వెళ్లడం ఆయనకు తగునా..? అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. దీంతొ అమేధీలో తమ నేత రాహుల్ గాంధీపై వున్న తమ భావాలను గేయం రూపంలో కూర్చి మరీ పాడుతున్నారు. 'జానే వో కౌన్సా దేశ్, జానే తుమ్ చలే గయే' ‘న చిట్టి న సందేశ్ కహా తుమ్ చలే గయే’ (నువ్వెక్కడికి వెళ్లావో ఎవరికీ తెలుసు, కనీసం ఉత్తరం లేదు, నువ్వెక్కడికి వెళ్లావో) అంటూ ప్రకటించారు.
అంతేకాదు.. అమేధిలోని ప్రజలు తాము ఎదుర్కోంటున్న పది ముఖ్యమైన సమస్యలను కూడా ఏకరువు పెట్టారు. అమేధీలో నాయకుడు లేడని, అభివృద్ది లేదని, తమ ప్రాంతాల్లోని పాడపోయిన రోడ్లను గురించి, రైతుల సమస్యల గురించి, మంచినీటి సమస్య గురించి, క్షీణించిన ఆరోగ్య వసతులపై విద్యార్థుల సమస్యలతో పాలు అనేక సమస్యలు జాబితా రూపాల్లో ప్లెక్సీల్లో పొందుపరిచారు. ఆయనతో పాటు బీజేపీ కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా తప్పిపోయారంటూ వీరిద్దరు పలు వాగ్దానాలు చేసి వాటిని అమలుచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం వెనుక బీజేపి పాత్ర వుందని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు. దేశంలో మార్పు తీసుకువస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ.. అమిత్ షాతో కలసి ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా మార్పు తీసుకువస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more