మనీలాండరింగ్ కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో ఝలక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో రూ.232 కోట్లను ఈడీ సీజ్ చేసింది. జగన్ ఇన్ఫ్రా, ఇండియాసిమెంట్స్ ఆస్తులను ఈడీ అలాచ్మెంట్ చేసింది. ఎన్నికల సమయానికి కొన్ని రోజుల క్రితం వరకు జైల్లో ఉన్న జగన్, ఎన్నికల సమయానికి బయటకు వచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఇండియాసిమెంట్స్కు చెందిన రూ.232 కోట్లు విలువ చేసే కడప, విశాఖ, బెంగళూరు, పంజగుట్టలోని ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. జనని ఇన్ఫ్రా ఆస్తుల్లో కడప జిల్లాలోని తాడిగొట్లలో 2.11 ఎకరాల భూమి, విశాఖ మధురవాడలోని 1.97 ఎకరాల స్థలం, బెంగళూరు వగత విలేజ్లోని 2.3 ఎకరాల భూమి, పంజాగుట్టలో 886 చదరపు అడుగుల భవనం అటాచ్మెంట్ చేశారు. బంజారాహిల్స్ విజయా బ్యాంకులోని రూ. 96 కోట్ల డిపాజిట్లు, ఇండియా సిమెంటుకు చెందిన రూ. 86 కోట్లు విలువ చేసే త్రినేత్ర సిమెంటు కంపెనీ షేర్లు, కోరమాండల్కు చెందిన రూ. 20 కోట్ల డివెంచర్లు అటాచ్ చేశారు. వాటితో పాటు ఇందిరా టెలివిజన్లోని రూ.10 కోట్ల షేర్లు, ఇండియా సిమెంట్స్కు సంబంధించి త్రినేత్ర సిమెంట్స్ షేర్ల పేరిట ఉన్న రూ. 10 కోట్లు, కార్మెల్ ఏషియాకు చెందిన రూ. 3 కోట్లు, కార్మల్ ఏసియాకు సంబంధించి ఇందిరా టెలివిజన్లో ఉన్న రూ. 25 లక్షల షేర్లు ఈడీ అటాచ్మెంట్ చేసింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more