కెమెరామెన్ విన్సెంట్ గురించి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పనిచేసిన ప్రఖ్యాత కెమెరా మెన్, దర్శకుడు ఎ.విన్సెంట్ కన్నుమూశారు. కొన్నాళ్లగా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నేపధ్యంలో విన్సెంట్ గారి గురించి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు. ''జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అంత అందంగా రావడానికి ముఖ్యకారణం విన్సెంట్గారు. ప్రతీ ఫ్రేమ్నీ ఓ పెయింటింగ్లా ఆయన చిత్రీకరించారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే 'అందాలతో అహో మహోదయం...' పాటలో పాలిథిన్ కవర్లను ఉపయోగించి మంచు కొండల్లాగా కనిపించేలా చేసిన ఆయన ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. అలాంటి ఓ గొప్ప సాంకేతిక నిపుణుడు దూరం కావడం బాధగా ఉంది'' అన్నారు.
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'సోగ్గాడు', 'జ్యోతి', 'అడవి రాముడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అల్లుడుగారు', 'ఘరానా మొగుడు', 'అల్లరి ప్రియుడు', 'మేజర్ చంద్రకాంత్', 'సాహసవీరుడు సాగరకన్య' తదితర చిత్రాలకు విన్సెంట్ ఛాయాగ్రహకుడిగా పనిచేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్రెడ్డి గారు స్పందిస్తూ... ''ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ పరిశ్రమకు ఆదర్శంగా నిలిచేవారు విన్సెంట్గారు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఇష్టమైన ఛాయాగ్రాహకుడు. 'గోవిందా గోవిందా' సినిమాలో విశ్వరూపం సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని తీసేందుకు విన్సెంట్గారే ఉత్తమం అని ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించాం. అద్భుతంగా తీశారాయన.
జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రీకరణలో ప్రదర్శించిన మేజిక్ నన్ను బాగా ఆకట్టుకొంది. విన్సెంట్గారు చేసిన చిత్రాల్లో 'అన్నమయ్య' అన్నా నాకు అంతే ఇష్టం. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఓ గొప్ప సాంకేతిక నిపుణుడాయన. తనయులిద్దరినీ ఛాయాగ్రహకుల్ని చేశారు. వాళ్లు కూడా తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకొంటున్నారు'' అని చెప్పుకొచ్చారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more