ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ పోటీబరిలో వున్న ప్రధాన పార్టీలు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకరిపైమరొకరు తిట్లపురాణం సంధించుకోవడం వరకు బాగానే వుంటుంది కానీ.. మరీ హద్దుదాటితే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ ప్రదర్శించిన తీరు చూస్తే.. ప్రతిఒక్కరు నోళ్లవేళ్లబెట్టుకోక తప్పదు. బతికే వున్న అన్నాహజారేను చనిపోయినట్లుగా చూపించడం సంచలనంగా మారింది.
ఎన్నికల నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల్లో మునిగిపోయిన బీజేపీ పార్టీ.. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ దానికి వ్యతిరేకంగా ప్రకటనలను ఇస్తోంది. ఇందులో కేజ్రీవాల్’ని టార్గెట్ చేస్తూ.. గతేడాది ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడంపై విమర్శనాస్త్రాలను సంధించింది. అలాగే ‘‘అధికారం కోసం పిల్లలపై ఒట్టువేసి మరీ అబద్ధాలు చెబుతాను’’ అంటూ కేజ్రీ అన్నట్లుగా బొమ్మను ప్రదర్శించారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ యాడ్’లో అన్నాహజారే చిత్రాన్ని ఉపయోగించి, దానికి పూలమాలవేసి వున్నట్లుగా చూపించింది. హిందూసంప్రదాయం ప్రకారం చిత్రపటానికి పూలమాలవేస్తే సదరు వ్యక్తి చనిపోయినట్లని అర్థం! అంటే.. ఈ ప్రకటనలో బీజేపీ ‘అన్నా’ చనిపోయినట్లుగా చూపించిందన్నమాట!
ఈ ప్రకటనను వీక్షించిన అనంతరం కేజ్రీవాల్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ముఖ్యంగా అన్నా చిత్రపటానికి వేసిన పూలమాలను చూసి ఆయన ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో ఆయన బీజేపీ పార్టీపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హజారే చనిపోయినట్లుగా చూపిన చర్యకుగానూ బీజేపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి హిందూ సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి చిత్రాలకు మాత్రమే పూలదండలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీ మాట్లాడుతూ.. ‘‘1948లో నాథూరాం గాడ్నే గాంధీజిని చంపాడు. ఈరోజు బీజేపీ తన ప్రకటనలో అన్నాను చంపింది. ఇందుకు బీజేపీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే’’ అని ఆయన డిమాండ్ చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more