వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో విక్కెట్ ను కోల్పోనుందా..? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతిపెద్ద, ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించిన పార్టీ తమ నాయకులను సంతృప్తిపర్చడంలో విఫలం అవుతోందా.? అంటే అవుననే సమాదానాలే వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒకొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ పార్టీ అవిర్భావం నుంచి వున్న నేతలు.. ఇప్పుడు వైసీపీకి దూరం అవుతున్నారు. దీనికి కారణమమేమిటన్నది పక్కన బెడితే.. ఇప్పుడు తాజాగా మరో ముఖ్యనేత పార్టీ ముఖ్య సలహాదారు హోదాలో వున్న నేత కూడా వైసీపీకి దూరమవుతున్నారన్న వార్త వైసీపీ క్యాడర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
వైసీపీ పార్టీ అవిష్కరించే ముందు తన తండ్రి స్థానంలో వుండి బాబాయ్ లా పార్టీ బాధ్యతలను చూసుకోవాలంటూ తీసుకువచ్చిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డిని కూడా జగన్ దూరం చేసుకుంటున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతగా, సలహాదారుగా వున్న మైసూరా రెడ్డిని, ఆయన సేవలను వినియోగించుకోవడంలో జగన్ విఫలమవుతున్నాడన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే.. వైసీపీ అధినేత జగన్ కు అహంభావం ఎక్కువని, ఆయన పెద్దలకు కూడా గౌరవమివ్వరని చెప్పిన పలువురు నేతలు ఇతర పార్టీల వైపు పరుగులు తీశారు. పార్టీ పునాదుల నుంచి వున్న జూపూడి లాంటి నేతలు కూడా జగన్ బాటలో నడవలేకు మధ్యలోనే జారుకున్నారు.
ఇప్పుడు పార్టీ ముఖ్య సలహాదారుగా వున్న మైసూరా రెడ్డి కూడా అదే పనిచేయనున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్టీని నడపడంలో సాయం కావాలని, ఎన్నికల తరువాత మైసూరారెడ్డిని, జగన్ పూర్తిగా పక్కకు పెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో మైసూరా కూడా వైసీపి నుంచి తప్పుకోనున్నారని సమాచారం. తన అభిమానులు, అనుయాయువులతో కలసి భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారని తెలుస్తోంది. వారి నిర్ణయం మేరకు ఆయన నుడుచుకోనున్నారని సమాచారం. ముఖ్యనేత, పార్టీ సలహాదారు, తెర వెనుక కథ నడిపించే ధీరులు వైసీపీకి దూరమైతే.. పార్టీ కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. పార్టీ విషయంలో జగన్ ఒంటరిగా కాకుండా పెద్దల శక్తియుక్తుల్ని వినియోగించాలని, సలహాలూ సూచనలను పాటించాలని, పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more