భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సంచలన విజయాలలు నమోదు చేసుకున్న అరుదన రోజు ఇది. చైనా ఓపెన్ సూపర్ సీరీస్ టైటిల్స్ ను ఇద్దరు భారతీయులు దక్కించుకున్నారు. అందులోనూ ఇద్దరు హైదరాబాదీయులే ఈ విజయాలను నమోదు చేసుకుని తెలుగువారి సత్తాను నలుదిశాల చాటారు. ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్.. చైనాలోని ఫుజూలో జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ లో జపాన్ క్రీడాకారిణీ అకానే యమాగుచిపై 21-12, 22-20 స్కోర్ తేడాతో విజయం సాధించారు. కేవలం 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ను సైనా ముగించారు. ఈ మ్యాచ్ లో సైనాకు అకానే గట్టిపోటినచ్చింది. అయితే అకానే పై కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ ను గెలుచుకుంది సైనా.
పురుషుల సింగిల్స్ టైటిల్ను మరో తెలుగుతేజం గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. చైనా దిగ్గజ ఆటగాడు లిన్డాన్పై కిదాంబి శ్రీకాంత్ 21-19, 21-17తో అద్భుత విజయం సాధించి ఈ విజయం సాధించిన తొలి భారతీయుడుగా నిలిచాడు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన లిన్ డాన్ పై శ్రీకాంత్ గెలుసుకోసం చాలా శ్రమించాడు. అయితే 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఆద్యంతం శ్రీకాంత్ తన అసాధారణ అటతీరుతో అదిపత్యం కనబర్చాడు. శ్రీకాంత్ గత ఏడాది థాయ్ లాండ్ ఓపెన్ గ్రాండ్ పిక్స్ లోనూ బంగారు పతకం సాధించాడు.
చైనా ఓపెన్, మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్ రెండూ హైదరాబాదీ ఆటగాళ్లే కైవసం చేసుకోవడం మరో విశేషం. కాగా చైనా ఓపెన్ సూపర్ సీరిస్ ను గెలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ లకు తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఇదే తరహా గెలుపులను నమోదు చేసుకుని తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేయాలని ఆయన అకాంక్షించారు. చైనా ఓపెన్ సీరీస్ ను ఇద్దరు హైదరాబాదీలే గెలుచుకుని రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more