విదేశాల్లో అప్పుడప్పుడు కొంతమంది కొన్ని అనూహ్యమైన సాహసాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. అలా అని మన దేశంలో లేవని చెప్పడంలేదులెండి.. వాళ్లకు అవకాశాలొస్తాయి కాబట్టి ప్రదర్శిస్తారు.. ఇక్కడున్న వాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఛాన్సెస్ రావు.. అంతే తేడా! సరే ఆ విషయాలను కాస్త పక్కనపెడితే.. తాజాగా 35 ఏళ్ల నిక్ వాలెండా ప్రపంచంలోనే ఓ అరుదైన సాహసాన్ని చేసి అందరినీ అబ్బురపరిచేశాడు. తాను ఎటువంటి రక్షణ సహాయం లేకుండానే కేవలం ఒక బ్యాలెన్స్ డ్ కర్రతో సుమారు 500 అడుగుల ఎత్తులో ఒక తాడుమీద నడిచి.. ఔరా అనిపించాడు.
అమెరికాలోని షికాగోలో భారీ ఎత్తుగా వున్న రెండు బిల్డింగుల నడుమ డిస్కవరీ ఛానెల్ ఇతడి కోసం ఒక బలమైన తాడును ఏర్పాటు చేయించింది. ఆ తాడుపై నిక్ ఎటువంటి రక్షణ తాడు లేకుండా కేవలం తన బ్యాలెన్స్ డ్ కర్రతో ఎంతో సునాయాసంగా నడిచేశాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఒకవేళ ఇతను జారీకిందపడినా.. ఇతనిని పట్టుకోవడానికి కింద నెట్స్ గానీ ఇతర సౌకర్యాలు ఏమీ ఏర్పాటు చేయించలేదు. అయినా ఏమాత్రం తడపడకుండా రక్షణలు లేకుండానే ఇతడు అంతటి ఎత్తుపై నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈ స్టంట్ ను రెండుసార్లు పూర్తిచేసిన ఈ హీరో.. మొదట కళ్లు తెరుచుకుని వేగంగా నడిస్తే.. రెండోసారి కళ్లు మూసుకుని కాస్త ఆలస్యంగా ముగించాడు. నడిచేశాడు. ఒక స్టంట్ ను 6 నిముషాల 2 సెకెండ్లలో పూర్తి చేస్తే.. మరొక స్టంట్ ను 1 నిముషం 15 సెకెండ్లలో పూర్తి చేశాడు. అంత ఎత్తులో చల్లనిగాలి వీస్తున్నా వాటిని లెక్కచేయకుండా స్టంట్ పూర్తిచేయడం విశేషం! నిజానికి నిక్ గతంలో ఈ తరహాలోనే ఎన్నో స్టంట్ చేసేవాడు. అంతరూ రహదారుల ఫుట్ పాత్ ల మీద నడుచుకుంటూ వెళితే.. ఇతను మాత్రం దానికి అమర్చిన ఐరన్ రాడ్ మీద నడుస్తూ అందరినీ షాక్ కు గురిచేసేవాడు. అలా అలవాటుపడిన ఇతను.. నేడు భారీ ఎత్తులో నడిచి రికార్డు సాధించాడు. గతంలో ఇతని ముత్తాత కార్ల్ 1978లో ఇలా సాహసం చేసి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు కానీ ఇతను మాత్రం తన ముత్తాత కలను పూర్తిచేశాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more