కుంభకోణాల పార్టీగా పేరున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో మరోసారి పరాభవం చవిచూసింది. మహారాష్ర్ట, హర్యానా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. రెండు రాష్ర్టాల్లోనూ ఘోరంగాపరాభవం చవిచూసిందనే చెప్పాలి. ఇందుకు మోడి మ్యానియా ఒక కారణం అయితే.., ప్రభుత్వంలో ఉండగా యూపీఏ చేసిన తప్పులు రెండవ కారణం. దేశ ప్రజలు కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సులువుగా మర్చిపోలేకపోతున్నారు. అందువల్లే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫలితం హస్తంకు అనుకూలించటం లేదు. గతకాలపు తప్పిదాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి.
మహారాష్ర్టలో మొత్తం 288 స్థానాలకు జరిగిన జరిగిన ఎన్నికల్లో బీజేపి 122సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 63స్థానాలతో శివసేన రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 42స్థానాలతో కాంగ్రెస్, 41స్థానాలతో ఎన్సీపీ నిలిచాయి. సార్వత్రిక, తాజా ఎన్నికలకు ముందు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, మహారాష్ర్టలో ఎన్సీపి అధికారంలో ఉంది. ఈ రెండు మిత్రపక్షాలు. రెండు ప్రభుత్వాల హయాంలో ఎన్నో అక్రమాలు, కుంభకోణాలు జరిగాయి. కోల్ స్కాం, 2జీ, ఆదర్శ్ ఇలా అనేక అవినీతి మరకలు రెండు పార్టీలకు పట్టుకున్నాయి. అందువల్లే ప్రజలు ప్రత్యామ్నయంకు పగ్గాలు అప్పగించారు.
ఇక హర్యానాలో అయితే చెప్పనవసరం లేదు. భూపేంద్రసింగ్ హుడా పై వచ్చిన ఆరోపణలు.., ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం చూపించాయి. 90స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపి 47స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. కాంగ్రెస్ 15స్థానాలతో మూడవస్థానంకు పరిమితం అయింది. అంటే నిన్నటి వరకు అధికారపక్షంగా ఉన్న పార్టీ ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు.. ఈ తీర్పును కాంగ్రెస్ స్వీకరించటం తప్ప వ్యతిరేకించలేదు. ఎందుకంటే వారు చేసిన తప్పుల వల్లే ఇలా జరిగిందని హస్తం నేతలకూ తెలుసు.
స్వాతంత్ర్యం సాధించిన పార్టీగా.., ఇంధిరా, రాజీవ్ వారసత్వంగా కాంగ్రెస్ ను కొంతకాలం వరకు అంతా గౌరవించారు. కానీ ఈ మర్యాదను నేతలు నిలబెట్టుకోలేదు. నమ్మకం ముసుగులో ప్రజాధనంను నిలువుగా దోచుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఒక్కటైన దేశ ప్రజలు కాంగ్రెస్ ఎక్కడ కన్పించినా అవమానించటం మొదలు పెట్టారు. ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలను మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలిసేందుకు ఇది ఉదాహరణ. ఓటర్లు, ప్రజలు ఒకప్పటిలా లేరిప్పుడు. ఎంతో చైతన్యం అయ్యారు. తమకు ఎవరు మంచి చేయగలరు అని డిసైడ్ అయి వారిని ఎన్నుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు నమ్మకం కల్గించినవారే విజేతలు. ఈ విషయం గ్రహించి మంచిగా ఉంటే మంచి జరుగుతుంది... లేదంటే హిస్టరీ రిపీట్ అవుతుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more