తెలంగాణలో జు.డా.లు చేస్తున్న సమ్మె రోజురోజుకూ ఉద్రిక్తం అవుతుంది. గ్రామీణ సేవలకు వ్యతిరేకంగా తెలంగాణలోని వివిధ బోధనాసుపత్రుల జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వీరితో ఆదివారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వం.., జుడాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. దీనిపై జుడాలు మండిపడుతున్నారు. చర్చలకు అని పిలిచి సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అవమానించింది అని జుడాల సంఘం ప్రతినిధి వంశీ విమర్శించారు.
కేవలం ఇద్దరిని పిలిచి మొక్కుబడిగా చర్చలు జరిపి.., చివరకు డిమాండ్లను పరిష్కరించకుండా అవమానించారని మండిపడ్డారు. అందువల్లే ప్రభుత్వంపై చర్చలను తాము బాయ్ కాట్ చేశామని చెప్పారు. అయితే జుడాల వైఖరిని ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పుబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ఎందుకు అందించరు అని తెలంగాణ వైద్య, వైద్య విద్య శాఖమంత్రి రాజయ్య ప్రశ్నించారు. గ్రామాల్లో సర్వీసులపై అసెంబ్లీలో చట్టం కూడా చేశామని.., ఇప్పుడు ఈ చట్టాన్ని మార్చాలంటే ఎలా కుదురుతుంది అన్నారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి..,. లేదా అఖిలపక్షంలో చర్చించి అందర్నీ ఒప్పించాలి అన్నారు.
ప్రస్తుతం విభజన ప్రక్రియ పూర్తికాని నేపథ్యంలో సమ్మె చేయటం సరికాదన్నారు. జుడాల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. అటు జుడాల వ్యవహారశైలిపై కూడా రాజయ్య నిప్పులు చెరిగారు. పెద్దలు, ప్రభుత్వం అనే గౌరవం లేకుండా జూనియర్ వైద్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వేలుచూపించి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అటు చర్చలకు జుడాలు కానివారు, జుడాల సంఘంలో సభ్యత్వం లేనివారు కూడా వస్తున్నారు అని వివరించారు. అందువల్లే కేవలం పరిమిత సంఖ్యలో చర్చలకు జుడాలను అనుమతించామన్నారు.
అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులపై ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. గ్రామాలు, ప్రజలకు సేవచేయటానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. గ్రామీణ సర్వీసులను జుడాలు తిరస్కరించటం అన్యాయమని మంత్రి రాజయ్య పేర్కొన్నారు. వారి వైఖరి మార్చుకుంటే మిగతా డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more