(Image source from: kerala congress party vice president TH mustafa controversial comments on rahul gandhi)
సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా తమతమ పార్టీలో వున్న నేతల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విమర్శలు చేసుకోరు. తమ మధ్య ఎన్ని గొడవలు, వైరుధ్యాలు వున్నప్పటికీ ఒక్కొక్కరు మాట్లాడుకోరుగానీ.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోరు. ఒకవేళ అటువంటి ఆలోచన తట్టినా.. తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడి అలా చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలా కాదు. సీనియర్ నాయకులనే కాదు.. ఏకంగా పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఆ పార్టీకే చెందిన నేతలు ఏకాపారేస్తుంటారు. దేశంలో ఏ పార్టీలో లేనివిధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంటుంది. అందుకు ఉదాహరణగా తాజాగా జరిగిన ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.
కేరళ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అయిన టీహెచ్ ముస్తఫా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. రాహుల్ గాంధీలో అసలు నాయకత్వ లక్షణాలే లేవని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద జోకర్ అని అన్నారు. అతడు పార్టీ నుంచి విసిరేయబడిన ఒక నేత అని దుయ్యబట్టారు. రాహుల్ లాంటి అసమర్థులు కాంగ్రెస్ పార్టీకే దెబ్బ అనే రీతిలో నోటికొచ్చినట్లు తిట్టిపడేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని మాత్రం ఆయన ఆకాశానికెత్తేశారు. కాశ్మీర్ వదదలను ఎదుర్కోవడంలో, ఇరాక్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకురావడంలో మోడీ చూపి ఆత్మస్థైర్యం తిరుగులేదని ఆయన కొనియాడారు. తమ పార్టీ అధ్యక్షుడ్ని తిట్టరాని తిట్లతో తిట్టేసి.. ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని పొగడటం చూస్తుంటే.. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా విచిత్రమైనదిగా కనిపిస్తోందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more