మన భారతదేశం సాంకేతికపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత ముందుకు దూసుకుపోతున్నప్పటికీ... ఇక్కడి ఆచారవ్యవహారాలు మాత్రం ఇప్పటికీ మారలేదు. ఆ మాటకొస్తే మూఢనమ్మకాలు కూడా బాగానే పెరిగిపోతున్నాయి కానీ అది వేరే విషయం! యావత్తు ప్రపంచం మొత్తం మీద సంస్కృతీ - సంప్రదాయాలకు మారుపేరుగా భారతదేశానికి పేరు దక్కిన విషయం తెలిసిందే! ఎందుకంటే.. ఇక్కడ అన్యమతాలవారు రకరకాల సంస్కృతులకు అలవాటుపడిన వాళ్లున్నారు. ఆధ్మాత్మికపరంగా చెప్పుకుంటే... మన దేశంలోనే హిందూదేవతలు జన్మించడం వల్ల ఆనాటి కాలం నుంచి దేవతలు చెప్పిన విధంగా అలవాటుపరుచుకున్న కొన్ని ఆచారాలను ఇప్పటికీ మన పురాణాల రూపంలో సాక్ష్యాలుగా వున్నాయి. కాబట్టి ఏ విషయాన్నైనా ప్రారంభించడానికి ముందు తమతమ ఆధ్మాత్మిక దేవతలను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తూనే వుంది. అదొక బలమైన నమ్మకంగా ప్రజల్లో నిలిచిపోయింది కూడా!
ఇక అసలు విషయానికి వస్తే... మన భారతదేశంలో జనాభా ఏ విధంగా అయితే పెరిగిపోతుందో.. అదేవిధంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. వారికి ఏ కారణం వల్లో పెళ్లిళ్లు కావడంలేదో తెలియదు కానీ... తమకు పెళ్లిళ్లు త్వరగా జరగాల్సిందిగా గుళ్లచుట్టూ క్యూలు కట్టడం మొదలుపెట్టేశారు. వారు క్యూలు కడుతున్నది మరెక్కడో కాదు.. మన ఆంధ్రరాష్ట్రంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి! నిన్నమొన్నటివరకు కేవలం మన తెలుగుప్రజలు మాత్రమే తమకు పెళ్లిళ్లు జరగడం లేదనే ఆవేదనతో ఈ స్వామివారి ఆలయానికి దర్శించుకోవడానికి రాగా... నేడు దేశవిదేశాల నుంచి కొన్ని వేలసంఖ్యలో పెళ్లికాని ప్రసాదులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. భక్తులకంటే ఎక్కువగా పెళ్లికాని ప్రసాదులతోనే ఆ ఆలయం కిటకిటలాడుతోంది.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే.. కేవలం ఆరు మాసాల్లోపే పెళ్లిళ్లు జరుగుతాయని అనాదిగా పరిసర ప్రాంతాల్లో వున్న భక్తుల నమ్మకం! ఆ దేవుడి లీలా ఏమిటోగానీ.. ఇక్కడికి విచ్చేసిన పెళ్లికాని ప్రసాదుల్లో సాధ్యమైనంతవరకు అందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయంటూ ఆ ప్రాంతంలో వున్న వాసులు పేర్కొంటున్నారు. ఈ నమ్మకం రానురాను ఆనోట.. ఈనోట పడి యావత్తు దేశం మొత్తం వ్యాప్తిలోకి వచ్చేసింది. ఈ స్వామివారి విశిష్టత అందరికీ తెలిసిరావడంతో.. ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా దేశావిదేశాల నుంచి కూడా భక్తులు వేలసంఖ్యల్లో ఇక్కడ క్యూలు కడుతున్నారు. భక్తులు కోరుకున్న విధంగా అబ్బాయిలు, అమ్మాయిలకు వెనువెంటనే పెళ్లిళ్లు జరిగిపోవడంతో.. ఇటీవలకాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఈమధ్యకాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగిపోయింది.
తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలోని మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం వుంది. వివిధ దోషాల కారణంగా తమ అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయన్న ఆవేదనతో.. వారి తల్లిదండ్రులు ప్రతీరోజు వేలసంఖ్యల్లో ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కేవలం వీరేకాదు.. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన జంటలు తిరిగి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ఇక్కడ రోజుకి 30 నుంచి 40వేల మంది భక్తులు రద్దీ పెరిగిపోయింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more