ప్రస్తుతం తెలంగాణాలో వున్న కొరతల నేపథ్యంలో అక్కడి ప్రజలతోపాటు నేతలు కూడా ఇటువంటి నినాదాలే చేయాల్సి వస్తున్నట్టు కనిపిస్తోంది. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి ఆవేదననే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొన్నాళ్లవరకు అన్ని బాగానే నడుస్తున్న నేపథ్యంలో అనుకోకుండా తెలంగాణాలో కరెంటు కోత మొదలైంది. దాదాపు 5 నుంచి 8 గంటల దాకా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. పైగా నిన్నటికినిన్నే రైతన్నలు కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు.
దీంతో ‘‘తన సొంత రాష్ట్ర ప్రజలే విద్యుత్తుకోసం తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చూసి’’ కేసీఆర్ కు బాధ కలిగినట్లుంది. వెంటనే ఆయన విద్యుత్ సమస్యపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. న్యాయంగా తెలంగాణాకు రావాల్సిన విద్యుత్ ను ఆంధ్ర ప్రభుత్వం సరఫరా చేయకుండా లోలోపలే కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా వుందని... ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారని... వెంటనే రాష్ట్రానికి రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ ను పునరుద్ధరించాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి కోరారు.
ఇందులో భాగంగానే... ముద్దునూరు, వీటీపీఎస్ లలో విద్యుదుత్పత్తిని కావాలనే నిలిపివేశారని, తెలంగాణాకు కరెంట్ రాకుండా ప్రజలు అవస్థలు పడేలా ఏపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, తెలంగాణాకు కరెంట్ అందేలా చూడాలని... లేకపోతే ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో కలుగజేసుకుని... తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయాలని ఆయన వెల్లడించారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more