తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎన్నో ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే! అందులో ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా ముఖర్జీని ఎంపిక చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. అప్పట్లో ఆ వార్త పెద్ద దుమారాన్ని రేపడంతోపాటు.. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసి తెలివైన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు. అలాగే తెలంగాణ పోలీసు శాఖ రూపురేఖలు మార్చేసి అంతర్జాతీయ స్థాయిలో వుండే విధంగా సన్నాహాలు సిద్ధం చేశారు.
ఇప్పుడు తాజాగా అటువంటి తరహాలోనే ఇంకో నిర్ణయాన్ని ప్రకటించారు కేసీఆర్! ప్రస్తుతం రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఈ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరపడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తూనే వుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహించి ఒక ప్రత్యేకతను చాలాలనే భావంతోనే ఆయన ఈ విధమైన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇదిలా వుండగా... మన భారతదేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటై జెండాను ఎగవేస్తారు. దీనిని స్ఫూర్తి తీసుకునే కేసీఆర్ ఇలా ప్రత్యేకంగా గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇది ప్రపంచవ్యాప్తంగా వున్న పురాతన కట్టడాల్లో ఒకటి... పైగా నిజాం ప్రభువుల స్పృతి చిహ్నం కూడా కావడంతో.. ఈ వేడుకలను నిర్వహించడం మంచి పద్ధతేనని.. యావత్తు భారతదేశం మొత్తం మరోసారి తెలంగాణ రాష్ట్రం పేరు వినిపస్తుందని అందరూ పేర్కొంటున్నారు.
ఇక్కడివరకు బాగానే వుంది కానీ.. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ తరహాలో ఇక్కడ విశాలమైన ప్రదేశం లేదని... ఇక్కడ జెండాను ఆవిష్కరిస్తున్న రోజు వచ్చే పర్యాటకులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని.. శకటాల ప్రదర్శన వంటి ఇతర కార్యక్రమాలను నిర్వహించడం కష్టం అవుతుందని తెలుపుతున్నారు. పైగా ఎక్కువ జనాలు గుమికూడే అవకాశాలుంటాయి కాబట్టి ఇందులో వున్న ప్రాచీన కట్టడాలు దెబ్బతినే అవకాశం కూడా వుంది. దీంతో కేసీఆర్ రాజరికపు పోకడకు, నియంతృత్వ ధోరణికి అడ్డుపడే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి దీనిపై కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more