జరిగిన విషయమేమిటి, అది తీసుకున్న రూపమేమిటని చూస్తే, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా సమస్య అంతర్జాతీయ వివాదానికి దారితీసిందంటే అందుకు కారణం దాని వెనుకనున్న మనుషుల కుటిల రాజనీతేనని చెప్పక తప్పదు. దానితో, నేటివిటీ ఇస్యూ నేషనల్ ఇష్యూ అయిపోయింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోవా లక్ష్మణ్ మాట్లాడింది తెలంగాణా స్థానికత గురించైతే, అది కాస్తా భారత్, పాకిస్తాన్ మధ్య హిందూ, ముస్లిం ల మధ్య తగవులా మారింది. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడిన మాటలు మరోసారి వీడియోలో వింటే, ఆయనెక్కడా సానియా మిర్జా జాతీయత గురించి మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది తెలంగాణా స్థానికత మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తనంతటం తానుగా వండి వార్చిన నియమాలను తానే ఉల్లంఘించి అందులో ఏ ఒక్క అంశమూ వర్తించని వ్యక్తిని రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించటాన్ని గురించి తప్పు పడుతూ.
స్థానికతను నిరూపించటానికి కెసిఆర్ పెట్టిన కొలమానాలు ఇవి-
1. ఆ వ్యక్తి కాని, ఆ వ్యక్తి కుటుంబం కాని 1956 కి ముందు తెలంగాణాలో పుట్టివుండాలి.
2. సదరు వ్యక్తి తెలంగాణాలో పుట్టివుండాలి.
3. సదరు వ్యక్తి కుటుంబం 1956 కి ముందు నుంచి తెలంగాణాలో నివాసముండి వుండాలి.
ఈ విధంగా కొత్త తెలంగాణా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బడుగులైన ఎస్ సి, ఎస్ టి, బిసి విద్యార్థుల కు ఆర్థిక సహాయం చేసే ఫీజ్ రియంబర్స్ మెంట్ ని ఆంధ్రోళ్ళు అనే ముద్ర వేసి ఎగ్గొట్టటానికి 1956 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ నియమాన్ని తీసుకొస్తున్నప్పుడు తెలంగాణా అంబాసిడర్ అని ఒకళ్ళని ప్రకటించి వాళ్ళకి ఒక కోటి రూపాయలను ఇస్తే ఎవరైనా ఈ కొత్త అంబాసడర్ కి 1956 అనే నియమం ప్రకారం తెలంగాణా స్థానికత ఉందా అని పరీక్ష చేస్తారు కదా!
వీటిని కొలమానాలుగా తీసుకున్న కెసిఆర్ బ్రాండ్ అంబాసడర్ ని నియమించినప్పుడు ఆ వ్యక్తికి పై వాటిలో ఏ ఒక్క విషయంలోనైనా అర్హత ఉందా. ఇదే డాక్టర్ లక్ష్మణ వేసిన ప్రశ్న. ఈ సందర్భంలో సానియా మిర్జా బ్రాండ్ అంబాసడర్ గా నియమించబడింది. ఆమె కాదు ఇక్కడ సమస్య. ఆ స్థానంలో వేరెవరైనా ఉన్నా పైన చెప్పిన కెసిఆర్ పరీక్షలకు నెగ్గినవాళ్ళే కదా తెలంగాణా స్థానికులు. కానందుకే కదా లక్ష్మణ్ తప్పు పట్టారు.
{youtube}CfYGx1hhI_M|560|400|1{/youtube}
అసలు సమస్య- రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పీజ్ రియంబర్స్ మెంట్ చెయ్యటంలో జరుగుతున్న జాప్యం, ఎవరు తెలంగాణా విద్యార్థులు అన్నదానికి కెసిఆర్ ఇచ్చిన నిర్వచనం, తెలంగాణా విద్యార్థుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని, అవసరమైతే విద్యా సంవత్సరాన్ని పొడిగిస్తామని అనటం!
అసలు విషయాన్ని మరుగుపరచి, మాది హిందుత్వ సిద్ధాంతం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీని ఇరుకున పడేసే ప్రయత్నాలతో పాటు అసలు భారత దేశమే ముస్లింలకు తగిన గౌరవం కాని అవకాశం కాని ఇవ్వకుండా వివక్ష చూపుతోందని నిరూపించే ప్రయత్నం కూడా జరిగింది. ఇది కచ్చితంగా రాజకీయ కక్షతో చేసిన పనే!
అంతర్యమేమిటంటే బారత దేశానికి తలవంపులు తేవటం, అధికారపార్టీ మీద బురదజల్లటమే!
కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వలన నష్టపోయేది బడుగుజాతి పిల్లలే. దళితులైనంత మాత్రాన తెలివితేటలలో కూడా వెనకబడివుండాల్సిన అవసరమేమీ లేదు కదా. అంటే వాళ్ళకి ఉన్నత విద్య లభించక చిన్న స్థాయిలోనే ఉండిపోవటం వాళ్ళకి, వాళ్ళకుటుంబాలకే కాదు దేశానికే నష్టం. అందుకే ఉన్నత విద్యనభ్యసించేవారి కోసం ప్రభుత్వాలు ఫీజ్ రియంబర్స్ మెంట్ మేమిస్తాం వాళ్ళని చదువుకోనివ్వండంటూ కాలేజ్ లు విశ్వవిద్యాలయాలకు చెప్తోంది. డబ్బున్న వాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు కానీ కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వలన విద్యకు వంచితులవుతున్నది ఆర్థికంగా వెనకబడి ఉన్నవారే!
డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నించింది తెలంగాణా స్థానికత విషయంలో కెసిఆర్ తయారు చేసిన నియమాల గురించే. అందులో ఏదైనా ఆయన నియమించిన బ్రాండ్ అంబాసడర్ కి ఉన్నాయా అన్నది ఆయన ప్రశ్న. ఇక్కడ బ్రాండ్ అంబాసడర్ గా నియమించబడింది సానిమా మిర్జా కాబట్టి ఆమెకు ఆమెను నియమించిన కెసిఆర్ స్వయంశోధనతో కనుగొన్న నియమాల దృష్ట్యా అర్హతలున్నాయా అన్నదే ఆయన ప్రశ్న.
1. ఆమె తెలంగాణాలో పుట్టిందా? Yes/no అన్నవి మీరే రాసుకోండి. ముంబైలో జన్మించింది.
2. ఆమె కుటుంబం తెలంగాణాకు చెందినవారా? మహారాష్ట్ర నుంచి వచ్చినవాళ్ళు.
3. ఆమె తెలంగాణాలో కొనసాగబోతోందా? పాకిస్తాన్ పౌరుడిని పెళ్ళి చేసుకోవటం వలన అది జరిగేపని కాదు. వాంఛనీయం కూడా కాదు.
మన పద్ధతుల ప్రకారం కోడలు అత్తారింటికి పోతుంది కాని అల్లుడు అత్తారింటికి వస్తాడా అంటే, సానియమ్మ వాళ్ళాయన ఉండే ఊరికే వెళ్తుంది కదా! ఈ సందర్భంగా పాకిస్తాన్ కోడలు అన్నారు. అది నిజం కాదా? పాకిస్తాన్ వాళ్ళని పెళ్ళి చేసుకుంటే పాకిస్తాన్ కోడలు అని నిజాన్ని చెప్తే, "అదిగో నన్ను ఇండియన్ అనటం లేదు!" అంటే అది సరికాదు కదా. "ఆమె ఇండియన్ కాదు" అని ఎవరూ అనలేదు. తెలంగాణా అంబాసడర్ గా ఉండటానికి 1956 అనే ప్రమాణం ప్రకారం కొత్త అంబాసడర్ గారికి ఉందా లేదా అన్నది మాత్రమే చర్చించటం జరిగింది. దీన్నంతా మసిపూసి మారేడుకాయ చేసి, నేషనల్ మీడియా ముందుకెళ్ళి అబద్ధాలు చెప్పి, మొసలి కన్నీరు కార్చి, అదిగో ఇండియాలో నన్ను అవమానపరుస్తున్నారు అంటూ వగల ఏడుపు ఏడ్చి భారత దేశాన్ని ప్రపంచంలోనే, "ఛీ ఇంత ఆదివాసులా?" అనేటట్లు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు. మోదీ మీద, బిజెపి మీద ఇంత కల్పించి బురద జల్లటం ఈ తెలంగాణా అంబాసడర్ కి తగునా?
4. డా.లక్ష్మణ్ సానియా మిర్జాని తప్పు పట్టలేదెప్పుడూ! ఆయన ప్రశ్నించింది కెసిఆర్ ని, స్థానికత విషయంలో 1956 ని ప్రమాణంగా కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని! దీన్నింతగా వక్రీకరించి కొత్త విషయంలా చేసి రాద్ధాంతం చెయ్యటం ఎందుకు, దేశం పరువు తీయాలనా? ఈ వక్రభాష్యాలను, ప్రపంచంలోని మీడియా అంతా పనికట్టుకుని ప్రచురిస్తున్నాయి, ప్రసారాలు చేస్తున్నాయి!
5. అసలీ చర్చంతటిలో సానియా పాత్ర ఏమీ లేదు. అసలు విషయం- స్థానికులుకానివారిని బ్రాండ్ అంబాసిడర్ చెయ్యటం!
మహారాష్ట్రకి చెందిన ఆమె కుటుంబానికి తెలుగే రాదు. ఆమె తెలుగులో మాట్లాడలేదు. కానీ తెలంగాణాకు బ్రాండ్ అంబాసడర్! పాకిస్తాన్ క్రికెటర్ ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి అక్కడ సంసారం చేస్తున్న సానియా మిర్జా భర్తను వదిలిపెట్టి ఇక్కడే ఉండిపోయి బ్రాండ్ అంబాసడర్ గా పనిచెయ్యాలనుకోవటం తప్పు కూడా అవుతుంది! చెంపలు వాయించుకోవలసిన అపరాధం.
పోనీ ఇదంతా తెలంగాణాలో ఉన్న రాజకీయ సమస్య, దాన్ని పెంచటం ఎందుకని సానియా మిర్జా అనుకుందా? తన దేశభక్తిని చాటుతున్న సానియా మిర్జా దేశం పరువే తీస్తోంది కదా! పాకిస్తాన్, భారత్ ల మధ్య వైషమ్యాలు పెంచటం దేశభక్తికి తార్కాణమా? ఆమె ఏ దేశస్తురాలన్నది ఇక్కడ ప్రశ్నే కాదు కదా? తెలంగాణా స్థానికత లేదన్నదే ఆరోపణ. అది కూడా ఆమె మీద కాదు- కెసిఆర్ నిర్ణయం మీద- స్థానికత లేకపోవటం నేరం కాదు కనుక!
దేశభక్తి ఉన్నవాళ్ళు మాట్లాడేది ఇలా ఉంటుంది-
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం గురించి రిటైర్డ్ జస్టిస్ ఎస్.హెచ్ కపాడియా అన్న మాటలివి- “నేను భారతీయుడనైనందుకు గర్విస్తున్నా. కేవలం 167000 మంది జనాభా ఉన్న మైనారిటీకి చెందిన నాలాంటి వాళ్ళు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని పొందగలగటమనేది భారతదేశంలోనే సాధ్యం. ఇవి పొరుగుదేశాలలో కానరాదు.”
అంతేకానీ మీడియాను తప్పుదోవ పట్టించేట్టుండదు!
డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడింది తెలుగులో, మీడియాలో దాన్ని వక్రీకరించి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాను తప్పుదోవ పట్టించటం జరిగింది. అంతా చెప్పి, వలవలా కన్నీరు కారుస్తూ తన మీద సానుభూతినే కాకుండా దేశానికి, పాలిస్తున్న ప్రభుత్వానికి చెడ్డేపేరు తెచ్చే ప్రయత్నం జరిగింది. దీన్ని ఆమె తన దేశభక్తిగా చాటుకోవచ్చు కానీ ఆ మాటల పర్యవసానం, ఫలితం మాత్రం అలా లేవు.
భారతంలో శల్య సారధ్యమని చెప్పటం జరిగింది. అది ఇలాంటిదే. కర్ణుడికి రథ సారధిగా శల్యుడు నియమించబడతాడు. కానీ అతను పాండవ పక్షపాతి కాబట్టి సారథ్యం వహించినట్లే బయటకు కనిపిస్తుంది కానీ కర్ణుడు మానసికంగా కృంగిపోవటానికి, యుద్ధంలో పరాజయం పొందటానికే శల్యుడు ప్రయత్నిస్తుంటాడు.
సానియా మిర్జా అలా ఎందుకు మాట్లాడవలసివచ్చింది, ఆ మాటల వెనుక ఎవరి స్క్రిప్ట్, ఏ ఉద్దేశ్యాన్ని ఆశించి తయారు చేసింది ఉంది, అన్నది ఆలోచించ తగ్గ విషయమే కానీ అంతకంటే అత్యవసరంగా ఆలోచించవలసింది విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి. అది సామాజికంగా జరుగుతున్న అన్యాయమే. ఆర్థిక పరంగా ఉన్నత విద్యను అభ్యసించలేని విద్యార్థులు ఎదగకపోతే సమాజానికే నష్టం. కెసిఆర్ తీసుకున్నది ఎస్ సి, ఎస్ టి, బిసి, దళితుల పట్ల తీరని నష్టమే కలిగించే నిర్ణయం. అదే డాక్టర్ లక్ష్మణ్ చెప్పిన మాట.
దానికీ హిందు ముస్లిం అని విడదీయటానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక ముస్లిం యువతిని బ్రాండ్ అంబాసడర్ గా కెసిఆర్ నియమిస్తే అది లక్ష్మణ్ చేసిన తప్పిదమా? ఆ స్థానంలో ముస్లిం ఉండబట్టి అసలు ఆ ప్రస్తావన తీయటమే తప్పవుతుందా? ఆ స్థానంలో మరో మతస్తురాలుంటే వారిని అవమానపరచినట్లవుతుందా? అంటే హిందూ మతం వాళ్ళు కాకుండా కెసిఆర్ పెట్టిన నియమాల ప్రకారమే అనర్హులైన వారికా హోదా కట్టబెడితే కెసిఆర్ చేసింది తప్పని అనగూడదా?
బ్రాండ్ అంబాసడర్ కి ఇచ్చిన కోటి రూపాయలతో తెలంగాణాకి ఏం లాభం జరుగుతుందో తెలియదు కాని, దానితో 100 మంది విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ జరిగివుండేది. 100 దళిత కుటుంబాలు బాగుపడివుండేవి. 100 దళిత విద్యార్థుల ప్రతిభ వ్యర్థం కాకుండా ఉండేది. ఆ ప్రతిభ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలిగేదో ఆ అవకాశాన్ని పొగొట్టుకోకుండా ఉండటం జరిగేది. ఈ మాటలు డాక్టర్ లక్ష్మణ్ చెప్పలేదు. ఆయన తెలంగాణా వ్యర్థం చేసుకుంటున్న కోటి రూపాయలు గురించి కాని, బ్రాండ్ అంబాసడర్ దేశీయత గురించి కానీ, బ్రాండ్ అంబాసడర్ మతాన్ని గురించి కానీ ప్రస్తావించలేదు. ఆయన విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో స్థానికత పేరు మీద గందరగోళాన్ని ఒక పక్క సృష్టిస్తూనే మరోపక్క తన నియమాలను తానే తుంగలో తొక్కిన వైనాన్ని మాత్రమే ఎత్తిచూపారు.
భారతీయ జనతా పార్టీలో అధికారంలో ఉన్న నాయకులు దీనిమీద స్పందించకపోవటం, డా.లక్ష్మణ్ మాటలను సమర్థించకపోవటం వాళ్ళు ఎంత ఒత్తిడికి లొంగిపోయారన్నది తెలియజేస్తోంది. అసలే హిందుత్వవాదులుగా ముద్రపడిన భాజపా ఈ ఘటనతో మరింత మచ్చ వేసుకోవటం, దేశంలో ముస్లిం వర్గాలను దూరం చేసుకోవటం రాజకీయపరంగా సరైనది కాదని అనుకోవటంతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడదామనే అభిప్రాయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కానీ ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి మాత్రం, “సానియా మిర్జా తను భారతీయురాలినన్న విషయాన్ని నొక్కి వక్కాణిద్దామని ఎందుకు చూస్తోంది? ఆమె ఇండియన్ కాదని ఎవరూ అనలేదే! ఆమె బ్రాండ్ అంబాసడర్ గా తగదని మాత్రమే చెప్పటం జరిగింది” అన్నారు. ఇదే మాటను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చెప్పారు.
ఎక్కడా ఏ దేశంలోనూ ఏప్రాంతంలోనూ లేని ప్రాంతీయతా నియమాన్ని నూరి, పుఠం పెట్టి, ఔషధ గుళికలని పేరు పెట్టి, చివరకు అది దళితుల పాలిట విషగుళికలయ్యేటప్పటికి దాన్ని మరుగున పరచటం కోసం ఎవరో ఆడించిన రాజకీయ నాటకమేనా బ్రాండ్ అంబాసడర్ మీడియాలో అందరి చేత కన్నీరు పెట్టించే సన్నివేశాన్ని పండించే ప్రయత్నం చెయ్యటం? జరిగింది అదే అయితే కోటి రూపాయలు వసూలైనట్లే! తెలంగాణా పేరు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిపోయింది.
అసలు విషయం మరుగున పడ్డా, సత్యం పలికినవారు దోషులుగా నిలిచినా, ఈ మొత్తం వ్యూహాన్ని రచించినవారు తాము అనుకున్నదైతే సాధించారు. ఇక్కడ జనసేన నాయుకులు ఒకరు అన్న మాటలు జ్ఞాపకం వస్తాయి.
“అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు”
అలా పైన పోస్ట్ చేసిన ఫొటో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కొటేషన్ ని కేవలం ఫేస్ బుక్ లోంచి తీసుకోవటం జరిగింది కానీ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావు.
This is what Retd. Justice S.H. Kapadia has to say about the world's largest democracy.
"I am proud to be an Indian. India is the only country where a member of the minority Parsi community with a population of 1,67,000, like myself, can aspire to attain the post of the Chief Justice of India. These things do not happen in our neighbouring countries."
So no matter what news channels, pseudo intellectuals or armchair thinkers tell you. You are secular in true sense- BJP senior leader Subramania Swamy says.
----------
Dr.Laxman asked Telangna governement, "You are giving ambassador status for Sania Mirza, why not (help) students? You are denying scholarships and fee reimbursement to students who have settled down in Hyderabad 10 or 15 years ago. But, Sania Mirza, she has married a Pakistani and you are giving her (brand ambassador status). We are not opposing (brand) ambassador (status), we are comparing the issue," he said.
K Laxman, leader of BJP in the Telangana assembly, also made a statement on similar lines, but it was given a different interpretation by the media.
The Telangana nativity of Sania issue is mischievously misrepresented as NATIONALITY of Sania in the media. Dr.Laxman never raised NATIONALITY of Sania as she tried to project, showing her ignorance of Telugu.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more