టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) చట్టంలో సవరణ బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టటం జరిగింది. దానికి ముందుగా ఆ బిల్లును సమర్థించవలసిందిగా భాజపా సభ్యులందరికి విప్ జారీ చెయ్యటం కూడా జరిగింది. దీనికి లోక్ సభలో నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ సవరణ కేవలం ట్రాయ్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రాని ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శిగా నియమించటం కోసమే జరుగుతుండటంతో లోక్ సభలో ఇతర పార్టీ సభ్యులు నిరసనలు తెలియజేసారు.
నృపేంద్ర మిశ్రా ఉత్తర ప్రదేశ్ నుంచి ఎన్నికైన 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎంతో కీలకమైనవి. ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, మంత్రుల సెక్రటేరియట్ కి అనుసంధానంగా పనిచేసే గురుతరమైన బాధ్యతను ప్రధానకార్యదర్శి చేపట్టటం జరుగుతుంది.
ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ట్రాయ్ లో ఛైర్మన్ లేక సభ్యులుగా వ్యవహరించినవారిని ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయటాన్ని నిషేధించటం జరిగింది.
దీని సవరణే ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు. ఇది పాసయినట్లయితే 69 సంవత్సరాల నృపేంద మిశ్రాని ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శిగా నియమించటానికి వీలవుతుంది.
ఈ మేరకు ఎన్డియే ప్రభుత్వం ఆర్డినెన్స్ ని జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ కేడర్ కి చెందిన నృపేంద్ర మిశ్రా ఐఏఎస్ ప్రధాన మంత్రికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారు, ఆయన సర్వీస్ ప్రధానమంత్రి టెర్మ్ తో పాటు గానీ లేదా భవిష్యత్తులో వెలువడే ఆదేశాల మేరకు అంతమొందుతుంది అంటూ పెర్సనల్ మంత్రిత్వ శాఖ నియామకాదేశాన్ని విడుదల చేసింది. దానికి చట్టరూపం ఇవ్వటం కోసం లోక్ సభలో బిల్లుగా ప్రవేశపెట్టటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more