(Image source from: Sunaja choudhary fires on telangana mps in lok sabha)
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సభలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మాట్లాడిన సుజనా చౌదరి.. ‘‘పోలవరం ఎవరబ్బా సోమ్మేంకాదు’’ అన్న రీతిలో వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు అనవసరంగా తెలంగాణ మంత్రులు అడ్డుపడుతున్నారని... దానిని అడ్డుకునే హక్కు వారికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు సందర్భంగా ఖమ్మం జిల్లాలో వుండే ఏడు ముంపు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కలుపుతున్నట్లుగా ఆర్డినెన్స్ ను జారీ చేసిన విషయం తెలిసిందే! దీంతో అలా చేర్చడం అన్యాయం అంటూ తెలంగాణ ఎంపీలు లోక్ సభలో వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని.. అలా కాని పక్షంలో ముంపు మండలాలను తెలంగాణాలోనే వుంచాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఇదే విషయం మీద సుజనా చౌదరి కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలవరం డిజైన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని సూచించిన ఆయన... తెలంగాణ ఎంపీలకు ఘాటుగానే సమాధానాలిచ్చారు. ఇంజనీర్లు ఏవిధంగా అయితే డిజైన్ చేశారో దానిని అలాగే వుంచాలని, వారు చెప్పినట్లే వినాలని అన్నారు. సునాయాసంగా తేలిపోయే ఈ ప్రాజెక్టును లేనిపోని లింకులు తగిలిస్తూ తెలంగాణ మంత్రులు రగడ చేస్తున్నారని... రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
విభజన చట్టం అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో స్పష్టత ఇచ్చిందని పేర్కొన్న ఆయన... ఈ విషయంలో కేసీఆర్ ను కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాగే హైదరాబాద్ విషయంలో గవర్నర్ కు పూర్తి అధికారాలు కల్పించాలని, అవసరం అయితే గవర్నర్ జోక్యం చేసుకునే విధంగా మాత్రమే తెలంగాణ మంత్రులు మార్పులు చేస్తున్నారని వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more