(Image source from: Cm kcr comments on bjp party)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీపేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సేమ్ టు సేమ్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు మీద విరుచుకుపడిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తీసుకుపోనీకుండా బీజేపీ కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు.
బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం.. ఆ పార్టీ విడుదల చేసిన కొత్త రైల్వే బడ్జెట్ లో చాలా లోపాలు వున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ఈసారి విడుదల చేసిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులేవీ కేటాయించలేదని... అసలు తెలంగాణాకు అనుకూలంగా అందులో ఏమీ పేర్కొనలేదని ఆయన వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ఏవిధంగా అయితే వ్యవహరించిందో.. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ లో వున్న లోపాల గురించి ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకిరణకు సంబంధించిగానీ, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ వంటి వాటి గురించిగానీ బడ్జెట్ లో ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు. అంతేకాక.. సర్వేలు పూర్తయిన ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని... ఇది ఎంతో బాధాకరమైన విషయం అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకి కేటాయించిన నిధులు కనీస సౌకర్యాలకోసం కూడ సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు.
దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం... సామాన్య ప్రజలకు తోడుగా వుంటాం.. అని వాగ్ధానాలు చేసిన బీజేపీ పార్టీ... ఇప్పుడు సామాన్య ప్రజలకు మోసం చేస్తోందని అని ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఏ విధంగా అయితే అందరినీ మోసం చేసిందో.. బీజేపీ కూడా అలాగే మోసం చేస్తోంది.. చేస్తూనే వుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more