తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి కోసం కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులిద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టటం, ఆదాయన వనరులను పెంచుకునే దిశగా పనిచెయ్యటం చేస్తున్న తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టాటా కంపెనీని తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా సాధించి ఒక మెట్టు పైకి ఎక్కారు.
విమాన పరికరాల పరిశ్రమ తెలంగాణాలో నెలకొల్పటానికి టాటా సంస్థ ముందుకొచ్చింది. సోమవారం హైద్రాబాద్ లో జరిగిన శంఖుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, 500 కోట్ల పెట్టుబడితో ఏర్పడుతున్న ఈ వైమానికి పరిశ్రమ తెలంగాణాలో ఏర్పడుతున్నందుకు ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కెసిఆర్ ఆనందాన్ని ప్రకటించారు. తెలంగాణా బ్రాండ్ ని విశ్వవ్యాప్తిని గావించాలన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి చేయూతనిచ్చిన టాటా సంస్థకు కెసిఆర్ ధన్యవాదాలు తెలియజేసారు.
రంగారెడ్డి ఆదిభట్ల వైమానికి ఆర్థిక మండలిలో విమాన పరికరాల తయారీకి ఏర్పడుతున్న డార్నియర్ సంస్థలో టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తో పాటు స్విట్జర్లాండ్ కి చెందిన రువాగ్ (RUAG) భాగస్వామ్యం వహిస్తోంది. మొదటి దశలో ఈ సంస్థ విమానం శరీరభాగం, రెక్కలను తయారు చేస్తుంది. రెండవ దశలో పూర్తిగా విమానాన్నే తయారు చేస్తామని ఆ సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణి విమాన తయారీ సంస్థగా రూపొందుతుందని రువాగ్ ఏవియేషన్ పంపిణీ విభాగానికి ఉపాధ్యక్షుడైన మార్టిన్ బుహ్లమాన్ అన్నారు.
డార్నియర్ సంస్థకు అవసరమైన అనుమతులను నిర్ణీత కాలంలో లభించేట్టుగా తనవంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కలిగిస్తామని కూడా కెసిఆర్ మాటిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more