Visakha leaders want vizag to be made capital

Vizag as new capital of AP state, Visakha leaders want it made capital, New capital for AP state, AP Capital Central committee

Visakha leaders want Vizag to be made capital

విశాఖను రాజధాని చెయ్యమని పట్టు!

Posted: 05/10/2014 09:48 AM IST
Visakha leaders want vizag to be made capital

ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ఎంపిక కోసం కేంద్రప్రభుత్వం చేత ఏర్పాటైన కమిటీ శుక్రవారం విశాఖపట్నం చేరుకోగా ఆ బృందాన్ని జిల్లా కలెక్టర్, గ్రేటర్ విశాఖ కమిషనర్, వుడా వైస్ ఛైర్మన్ కలిసారు.  రాజధాని బృందం విశాఖపట్నంలో ఉన్న వనరులను, వెసులుబాటున్న భూభాగాన్ని, విశాఖలో అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సేకరించారు.

రాజకీయ పార్టీల నాయకులు కూడా రాజధాని కమిటీని కలిసి విశాఖను రాజధాని చెయ్యాలని వినతి పత్రాలను అందించారు.  ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో పర్యటించి ఆ తర్వాత కమిటీ సభ్యులు కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశమౌతారు.  

విశాఖను రాజధాని చెయ్యాలని కోరినవారిలో కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్, విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన బోలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు.

విశాఖపట్నంలో వివరాలు సేకరిస్తున్న కమిటీ సభ్యులు ఆ తర్వాత విజయవాడ వెళ్తారు.  అక్కడ కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ ఈ బృందాన్ని కలుసుకుంటారు.  ఈలోగా జరుగుతున్న పనులకు డాక్టర్ రతన్ రాయ్ ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles