Kotla surya prakash reddy new demands

kotla surya prakash reddy new demands, GOM , central minister kotla surya prakash reddy, congress party, ap bifurcation,

kotla surya prakash reddy new demands

మంత్రి కోట్ల కు కేంద్రం షాక్?

Posted: 11/22/2013 10:33 AM IST
Kotla surya prakash reddy new demands

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయబాస్కర్ రెడ్డి కుమారుడు కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి జయసూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రజలకు తెలుసు. అంటే అతను కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుండి ..రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు మాత్రం కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ నాయుకుడు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదు. అయితే ఇటీవల కాలంలో ఆయన సీమాంద్ర ప్రజల కోసం కేంద్రం పై పోరాటం చేస్తున్నాడు. కేంద్రం మాత్రం సీమాంద్ర కేంద్ర మంత్రుల మాటలను పట్టించుకోకుండా.. రాష్ట్ర విభజన పై కేంద్రం దూకుడుగా ముందుకు పోతుంది.

 

అయితే సీమాంద్ర మంత్రులు కొంతమంది.. రాష్ట్ర విభజన తద్యమని భావించి, కేంద్ర ముందు సీమాంద్రకు ఏమి కావాలో ..కొన్ని డిమాండ్స్ ఉంచినట్లు సమాచారం. అలాంటి వారిలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఒకరు. కేంద్రం ముందు మంత్రి కోట్ల ఉంచిన డిమాండ్స్ ఇవే..

 

1. సీమాంద్రకు కర్నూలును రాజధాని చేయలి.

2. ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలి.

3. కర్నూలు, అనంతపురం కలిపి రాయల తెలంగాణ చేయాలి

 

ఇలా మంత్రి కోట్ల తన డిమాండ్స్ ను జీవోఎం సభ్యుల ముందు ఉంచటం జరిగింది. అయితే వెంటనే జీవోఎం సభ్యులు కోట్లకు షాకిచ్చారు. ఇలాంటి డిమాండ్స్ ను నెరవేర్చలేమని, కోట్లకు ముఖం మీద కొట్టినట్లు చెప్పటంతో ఆయన కేంద్రం మీద అలిగి.. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రివ్వున వచ్చినట్లు సమాచారం. కోట్లకు కేంద్రంలో జరిగిన అవమానం గురించి కాంగ్రెస్ నాయకులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles