2 జి కుంభకోణంలో వెలుగు చూసిన కొత్త కోణం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం స్పందన ఇలా ఉంది.
ప్రస్తుతం జెపిసి, పిఏసి, సిబిఐ పరిధిలో దర్యాప్తు జరుగుతున్న 2జి లైసెన్స్ ల గురించి సోమవారం నాడు హిందూ దినపత్రికలో రెండు కథనాలు వచ్చాయి.
ఆ రిపోర్ట్ లో, 2జి కుంభకోణం జరగక ముందే ప్రధాన మంత్రి కార్యాలయం మాజీ మంత్రి రాజా చర్యలను అంగీకరించారు. కానీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అదే ప్రధానమంత్రి రాజాని తనకు దూరంగా ఉంచారు. 2జి స్పెక్ట్రమ్ ని సాధారణ రేట్లకి కేటాయించటానికి ప్రధాన మంత్రి కార్యాలయం అంగీకారం తెలియజేసింది. అంటే ఎంట్రీ ఫీజులో ఎటువంటి మార్పులూ ఉండవద్దని అంటూనే ఆ నేరానికి రాజాని దోషిగా నిలబెట్టింది అని కూడా హిందూ పేర్కొంది.
కానీ హిందూ దినపత్రిక చెప్పేదాంట్లో ఈ తప్పులున్నాయి.
ఇదేదో కొత్తగా దొరికిన ఆధారమంటూ చెప్పటం తప్పు. ఈ పత్రాలు ఎప్పటి నుంచో ప్రజలందరి దృష్టిలోనూ ఉన్నవే. ఈ పత్రాల నకళ్ళు జెపిసి పిఏసి లకు సమర్పించబడినవే. అందువలన ఆ పత్రిక రిపోర్ట్ లలో ఉన్నట్టుగా కొత్తగా దొరికిన సాక్ష్యాధారాలేమి కావు.
ప్రధాన మంత్రి ఈ విషయాన్ని శాఖలో అందరితోనూ ప్రైవేటుగా పంచుకోదలచుకున్నారు కానీ అధికారికంగా ప్రకటించటంలేదు. అదేమిటంటే, రాజాతో అధికార స్థాయిలో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు, రాజాను చేతికి దూరంగా ఉంచదలచుకున్నారు అని. ఈ రిపోర్ట్ అంతకు ముందు కూడా విస్తారంగా ప్రచారంలో ఉన్నదే. దానికి ప్రధానమంత్రి కార్యాలయం జూలై 31, 2011 లో వివరణనిచ్చింది కూడా. అందువలన కొత్తగా దొరికిన సాక్ష్యధారాలంటూ పత్రిక చెప్పటం తప్పు. కొత్త ఋజువులంటూ పత్రిక చెప్పుకుంటూ వచ్చింది కేవలం ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా సందేశం (ప్రెస్ రిలీజ్) పేరా 3 (ఏ)-(డి) లోనివే. అవన్నీ పూర్వం వెల్లడి అయినవే బాగా ప్రచారంలో ఉన్నవే కానీ కొత్త విషయాలేమీ కావు.
పై విషయాలను తెల్పుతూ హిందూ కేవలం ఇప్పటికే తెలిసివున్న విషయాలను, ఇప్పటికే దానిమీద ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన వివరణలలోని కొన్ని అంశాలను ఎంచుకుని చెప్తోందంతే అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more