హైద్రాబాద్ లోని కీసరగుట్ట అతి ప్రాచీన మైన శివాలయం. అయితే ఈ క్షేత్రంలో జరగవలసినంత అభివ్రుద్ది జరగలేదు. శివరాత్రికి తప్పితే మిగతా పురాతన ఆలయాల్తో పోల్చి చూస్తే పెద్దగా భక్తుల సందర్శించినట్లుగా కనపడదు. ప్రధానాలయంలోని అర్చనలందుకునే శివలింగం కాక, ఆలయ ప్రాంగణంలో వందలాది శివలింగాలు దర్శనమిస్తాయి.
అటువంటి ఈ క్షేత్రానికి లక్షలలో భక్తుల సందర్శనయోగం కలగబోతోంది. ఈ క్షేత్రం ఖండాంతర వ్యాప్తిగా పేరుగాంచటానికి అవకాశం కలుగబోతోంది. ఇక్కడ ఏప్రిల్ 13 నుంచి 24 వరకు జరగబోతున్న అతిరాత్ర మహాయాగమే అందుకు కారణం. ఈ అతిరాత్ర మహాయాగాన్ని సందర్శించటానికి 20 లక్షల పై చిలుకే వస్తారని అంచనా వేస్తున్నట్టుగా ఆలయ ఛైర్మన్ టి.నారాయణ శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరోజు యాగాన్ని సందర్శిస్తారని తెలియజేసారు.
ఈ పుణ్యకార్యానికి పూనుకున్న తాత్త్విక హైందవ ప్రచారక సమితి (తపస్) మేనేజింగ్ ట్రస్టీ డా. శివకరణ్ నంబూద్రి మాట్లాడుతూ ఈ యాగం ద్వారా ఈ క్షేత్రానికి ఎంతో ఖ్యాతి కలుగబోతోందని అన్నారు. ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన వేదపండితులు ఈ కార్యక్రమానికి భూమి పూజతో నాంది పలికారు. ఆ తర్వాత యాగశాల నిర్మాణ స్థలంలో పతాకాన్ని ఎగురవేసారు. అహితాగ్ని చెరుముక్కు వల్లభన్ సోమయాజిపద్ ఈ యాగానికి యజమానిగా వ్యవహరిస్తారని కూడా తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more