యాసిడ్ దాడులు అయ్యాయి! కత్తితో కుత్తుకలు తెగ్గోయడమూ అయిపోయింది! ప్రేమ వైఫల్యం తాలూకూ కసి.. తుపాకీ కాల్పుల స్థాయికి చేరుకుంది!! అది క్షణికావేశం కాదు.. ఒక చోట మూడు హత్యలు చేసి, చేతిలో తుపాకులతో 40 కిలోమీటర్లు ప్రయాణించి మరీ అక్కడ మరో రెండు హత్యలు చేసిన ఘాతుకం! ఆపై ఆత్మహత్య చేసుకునేంతటి ఉన్మాదం! దేశరాజధానికి చెందిన పాతికేళ్ల యువకుడు సాగించిన దారుణ మారణకాండ ఇది. ఢిల్లీకి చెందిన రవి (25) రేణు అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రేణు భర్త నవీన్.. క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడు రవికి బంధువే. రెండేళ్లుగా రేణుతో సంబంధం కొనసాగిస్తున్న రవి కన్ను.. ఇటీవలే ఆమె చెల్లెలు బేబీపై పడింది. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రేణును కోరగా ఆమె అందుకు నిరాకరించింది. కోపంతో రగిలిపోయిన రవి.. పొద్దున తొమ్మిదిగంటలకు ఢిల్లీలోని బిందాపూర్లో ఉన్న రేణు ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె భర్త నవీన్ను కాల్చి చంపేశాడు. తుపాకీ శబ్దాలు విని పరిగెత్తుకుంటూ వారి పోర్షన్లోకి వచ్చిన ఇంటి యజమానురాలు షీలా (53)నూ వదిలిపెట్టలేదు.ఆమె తలలోకి మూడుసార్లు కాల్చాడు. తిన్నగా.. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజాపూర్ (ఉత్తరప్రదేశ్)కు చేరుకున్నాడు. అక్కడ రేణు తండ్రి హరేందర్, సోదరి బేబీ ఉంటున్న ఇంటికి చేరుకుని వాళ్లిద్దరినీ కాల్చేశాడు. పై అంతస్తుకు వెళ్లి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. రేణు, షీలా హత్యలు జరిగిన సమయంలో పనిమనిషి ఆ ఇంట్లోనే ఉన్నదని పోలీసులు తెలిపారు. అయితే, ఆమె భయంతో ఎలాంటి వివరాలూ చెప్పలేకపోతోందన్నారు. కాగా.. తొ లుత, రేణు భర్త ఇంట్లో లేడని పోలీసులు భావించారు. కానీ.. సాయంత్రానికి అతని మృతదేహం ఇంట్లోనే పడగ్గదిలో మంచం కింద లభ్యమైందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more