మరణం అంచుల వరకు వెళ్లిన వారు ఎలా ఉంటారు? కొద్ది సెకన్లలో మరణం వారి కళ్ళ ముందు నుంచి వెళ్లితే ఎలా ఉంటుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 192 మంది ఒకేసారి మరణం అంచుల వరకు వెళ్లి.. వచ్చారు. ఆ 192 మంది ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే అసలే వాతావరణం బాగాలేదు. విమానాశ్రయంలోని రెండు రన్వేల నుంచి రెండు జెట్ విమానాలు పైకెగిరాయి. మరో జెట్ విమానం ల్యాండ్ కావడానికి అటువైపుగా వస్తోంది. మూడు విమానాలూ గంటకు 500 కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నాయి. వాటి మధ్య దూరం రెండు కిలోమీటర్లు.. అంటే, అవి ఢీ కొనడానికి పట్టే సమయం కేవలం 12 సెకండ్లు..! అటు నుంచి రెండు విమానాలు.. ఇటు నుంచి మరో విమానం సర్రు సర్రున దూసుకు వస్తున్నాయి. చివరి క్షణంలో ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సిబ్బంది.. వెంటనే మరోదిక్కుకు మరల్చాలని ల్యాండింగ్కు వస్తున్న విమానం పైలట్ను ఆదేశించారు. పైలట్ సర్రున విమానాన్ని మరోదిక్కుకు తిప్పారు.
అయినా.. ఆ విమానాల నుంచి కేవలం 180 మీటర్ల దూరం నుంచి విమానం దూసుకుపోయింది. లేకపోతే.. ఏం జరుగనుందో ఆలోచించేలోగానే.. మూడు విమానాలూ ఢీకొని.. వాటిలో ప్రయాణిస్తున్న 192 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితే, ల్యాండింగ్కు, టేకాఫ్కు పెద్ద సంఖ్యలో విమానాలు వేచి ఉండడంతో పాటు.. వాతావరణం బాగా లేక రన్వేల దిశను మార్చాల్సి రావడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తికమక పడినట్లు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. గంటన్నర పాటు టెక్సాస్ విమానాశ్రయం మూసివేత..!శాన్ ఆంటోనియో: బాంబు పెట్టామన్న బెదిరింపుతో అమెరికాలోని టెక్సాస్లోని విమానాశ్రయాన్ని ఏకంగా గంటన్నరపాటు మూసేశారు! విమానాశ్రయంలో ఉన్న రెండువేల మందిని హుటాహుటిన అక్కడ నుంచి తరలించారు. ఓ ఆగంతుకుడు ఒకరు ఫోన్ చేసి, శాన్ ఆంటోనియా విమానాశ్రయంలోని మూడు మూట(లగేజీ)ల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించారు.
వెంటనే అప్రమత్తమై న అధికారులు.. విమనాశ్రయంలో దిగేందుకు విమానాలను అనుమతించలేదు. అప్పటికే దిగిన విమానాల్లోని ప్రయాణికులను త్వరగా బయటకు వెళ్లాలని హెచ్చరించారు. మొత్తంగా ఎయిర్పోర్టులో ఉన్న రెండు వేల మందిని బస్సుల్లో విమానాశ్ర యం వెలుపలకు పంపేశారు. విమానాశ్రయానికి వెళ్లే దారులను మూసేశారు.అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, పేలుడు పదార్థాల నిపుణుల బృందం రం గంలోకి దిగి.. విమానాశ్రయంలో అణువణువూ గాలించారు. గంటన్నర తరువాత బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more