పిసినారితనానికి, పొదుపు సూచనలకు పేరుగాం చిన మాంటెక్సింగ్ అహ్లూవాలియా సారథ్యంలోని ప్రణాళికా సంఘం తన విషయంలో మాత్రం హంగూ ఆర్భాటాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల ఆమోదంలో సవాలక్ష కొర్రీలుపెట్టే ఈ సంస్థ సొంత అవసరాల పేరిట ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసింది.
దేశంలో రోజూ 28 రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు చేసే వారు పేదలు కాదం టూ దారిద్య్రరేఖకు కొత్త నిర్వచనమిచ్చి ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న ప్రణాళికా సంఘం ఢిల్లీలోని తన కార్యాలయం ‘యోజనా భవన్’లో ఉన్న రెండు మరుగుదొడ్ల గదుల ఆధునీకరణకు ఏకంగా రూ. 35 లక్షలు ఖర్చుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఆధునిక హంగులున్న మరుగుదొడ్ల తరహాలో వీటిని నిర్మించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సుభాష్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని బయటపెట్టారు. టాయిలెట్స్ ఆధునీకరణకు రూ. 30,00,305 ఖర్చవగా వాటిలోకి అధికారులు తప్ప ఇంకెవరూ వెళ్లేందుకు వీల్లేకుండా చూసేందుకు మరో రూ. 5,19,426 ఖర్చుపెట్టి డోర్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
దీనికోసం 60 మంది అధికారులకు స్మార్ట్ కార్డులు జారీ చేశారు. అలాగే ఈ ఖర్చుకు అదనంగా మరుగుదొడ్లకు వెళ్లే దారిలో సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చాలని ప్రణాళికా సంఘం నిర్ణయించింది. దీనికి వ్యయ అంచనాలు తెలపాల్సిందిగా కేంద్ర ప్రజాపనుల విభా గం అధికారులను కోరింది. అహ్లూవాలియా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారనే విమర్శలు కూడా గతంలో వెల్లువెత్తాయి. 2011 మే నుంచి అక్టోబర్ వరకు ఆయన విదేశీ ప్రయాణ ఖర్చు రూ. 2.34 కోట్లుగా తేలిందని ఆర్టీఐ కింద వెల్లడైన వివరాలను ఉటంకిస్తూ ఓ పత్రిక ప్రచురించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more