రౌడీషీటర్ ఉన్మాద దాడిలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవకు పకోడి తిన్న తర్వాత బిల్లు చెల్లింపే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన పూర్తి వివరాలు... కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన కొమ్ము శ్యాంసన్ కుమారుడు అనిల్(25) కుటుంబం జిల్లా కేంద్రంలోని కిసాన్నగర్లోని చింత్లో స్థిరపడింది. జులాయిగా తిరిగే అనిల్పై ఇప్పటికే పలు ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయి. నేరాల తీవ్రత ఎక్కువవడంతో అతనిపై రౌడీషీట్ కూడాతెరిచారు. హోలీ ఆడిన తర్వాత కిసాన్నగర్కే చెందిన స్నేహితుడైన కోల్ల శ్రీనివాస్తో తీగలగుట్టపల్లికి వచ్చారు. అక్కడ మద్యం తాగుతూ పకోడి తిన్నారు. పకోడి బిల్లు రూ.30 చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్పై అనిల్ దాడి చేశాడు. బావమరుదులైన జెల్లోజి రాజు, నరేశ్కు శ్రీనివాస్ సమాచారం ఇచ్చాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వీరంతా చింతల్కు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నారు. గొడవపై అనిల్ను నిలదీశారు.
బలవంతంగా అనిల్ను పోలీస్స్టేషన్కు తరలించేందుకు ఆటోలో ఎక్కించారు. కొద్ది దూరం వెళ్లగానే దాహమవుతోందని, మంచనీళ్లు తాగుతాననడంతో అనిల్ను కిందికి దింపారు. అంతే ఒక్కసారిగా అనిల్ వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆరుగురిపై దాడిచేశాడు. ఈ ఘటనలో సోదరులైన రాజు, నరేశ్ గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కోల్ల శ్రీనివాస్, జనగామ కమల్, బత్తిని శశిధర్, పసుల విజయ్లను సాయిరాం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ జనగామ కమల్ ఉదయం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న మిగతా ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
అనిల్ను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రవీందర్ తెలిపారు. రాజు, నరేశ్, కమల్ కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు రౌడీషీటర్ అనిల్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అతడిని వదిలేస్తే మరెంతో మంది ప్రాణాలు తీస్తాడన్నారు. అనిల్ను మాకైనా అప్పగించాలంటూ మృతదేహాలతో ఆందోళనకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more