నగర ప్రజలు జర జాగ్రత్తగా ఉండండి... ఎందుకంటే మీరు నిత్యం ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటారు. దాని నుండి ఏదో ఒక రకమైన చెత్త మనకు తయారు అవుతుంది. ఆహార పదార్ధాలు మిగిలిపోయినప్పుడు కూడా చెత్త తయారవుతుంది. మరి ఈ చెత్తను కొందరు ఇంటి ముందు ఉన్న రోడ్డు మీదనో లేక నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో కాకుండా దాని ప్రక్కన వేస్తారు. అలాంటి వారు జర జాగ్రత్తగా ఉండండి.
ఈ చెత్తలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ తడి, పొడి చెత్త మనకు తయారవుతుంటాయి. ఈ రెండింటిని కలిపి పడవేసినా ఇక పై మనకు ‘తడి’ (జరిమానా) పడుతుంది. ఇక చెత్తే కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం మన జేబుకు భారీగా చిల్లు పడుతుంది.
ఘన పదార్ధాలకు సంబంధించిన కమిటీ తాజాగా ఈ సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా 28 పట్టణాలు, నగరాల్లో ఈ కమిటీ అధ్యయనం చేసింది. దీని పై కొన్ని కఠినమైన సిఫార్సులు చేసింది.
- నగరాల్లో... పట్టణాల్లో పౌరుల ఆరోగ్యానికి విఘాతం కలించే వ్యక్తులను ఉపేక్షించ కూడదు. తడి, పొడి చెత్తలను వేరేచేయకపోయినా, రోడ్డు మీద చెత్త వేసినా సదరు వ్యక్తి నుంచి అప్పటికప్పుడు జరిమానా వసూలు చేయాలి. ఈ మేరకు పురపాలక శాఖలో తగినంత మంది సిబ్బందిని నియమించాలి.
- జరిమానా కనిష్టం రూ. 100 నుండి గరిష్టం రూ. 5000 వరకు విధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానా మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు.
- జరిమానాను ఎప్పటికప్పుడు కట్టకపోతే ఆ మొత్తాన్ని సదరు వ్యక్తి ఆస్తి పన్నులో బకాయిగా పేర్కొనాలి. అలా వీలుగాని పక్షంలో మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
- ఘన పదార్థాల నిర్వహణలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గ దర్శకాలను పూర్తిస్ధాయిలో ఆచరణలో పెట్టాల్సి ఉన్నా అది జరగలేదు. వీటి అమలుతోపాటు పట్టణ జీవన ప్రమాణాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి.
- భవిష్యత్తులో వీధుల్లో చెత్త వేయడాన్ని పూర్తిగా నిషేదించాలి.
మరి వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు ఆచరిస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more