విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గత ఏడాది జరిగిన దసరా ఉత్సవాలలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. 2007 నుంచి 2011 వరకు ముందుగా రూపొందించిన అంచనాల కన్నా ఖర్చు తక్కవగా ఉండగా 2012లో మాత్రం రూపొందించిన అంచనాల కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు చేశారు. తద్వారా దాదాపు రూ. మూడు కోట్ల వరకు అదనపు వ్యయం జరిగినట్లు రికార్డులలోచూపారు. గత ఏడాది పలు ఆరోపణలపై సస్పెండ్ అయిన ఈవో రఘునాథ్ తరువాత వచ్చిన అధికారులు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారా?లేక ఆయనే అంచనాలను పెంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారా అన్న అంశంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కొంత కాలం ఇన్ ఛార్జిగా పనిచేసి కొద్దికాలానికే రిటైర్ అయిన విష్ణు ప్రసాద్ హయంలో కుంభకోణం జరిగిందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
ఇటీవల కాలంలో దసరా ఉత్సవాలలో ఏ చిన్న టెండరు ఖరారు కావాలన్నా స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా గత ఏడాది అంచనాలను ప్రామాణికంగా తీసుకుని ఈఏడాది 10 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చునని అధికారులు అంచనాలు రూపొందించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టెండర్ల ఖరారులో అడ్డగోలుగా వ్యవహరించడం, కాంట్రాక్టర్లను తమకు అనుకూలమైన వ్యక్తులను ఎంపికచేసుకునేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అమ్మవారికి భక్తుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయాల ఆదాయం పరుల పాలవుతుందనే విమర్శ వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే ఆహార పొట్లాల పంపిణీలో టెండర్ల ఖరారుఅంశం వివాదాస్పదంగా మారి న్యాయస్థానం వరకూ వెళ్లింది. గత ఏడాది దసరా ఉత్సవాల లో జరిగిన భారీ అవినీతి, కుంభకోణాలు ఈ ఏడాదికూడా పునరావృత్తం అవుతాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. చివరి నిమిషం వరకూ పనులకు సంబంధించి టెండర్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం, చివరికి ఆదరాబాదరగా తమ అనుంగు అనుచరులకు కట్టబెట్టాలని ఈవోపై వత్తిడి తేవడం ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా మారింది. అమ్మవారి సొమ్ము తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా కాంట్రాక్టర్ల ముసుగులో స్వాహా చేయడం గత రెండేళ్లుగా స్థానిక నేతలకు, కీలకమైన అధికారులకు పరిపాటిగా మారింది.
కలుపుమొక్కలుగా
రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు రైతులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో ఈరోజు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రోహులే అన్నారు. వీరు నిజంగా తెలుగు తల్లికి పుట్టి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేసే ఏ పార్టీ నాయకుడైనా ఓటెయ్యవద్దని, అటువంటి అవకాశ రాజకీయ నాయకులకు 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే బుల్లెట్తో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మారిన సంగతి గత ఎన్నికలు రుజువు చేశాయని, 2014 ఎన్నికల్లో అదే చరిత్ర పునారావృతం అవుతుందని హెచ్చరించారు. 2004లో తెలంగాణాపై రెండో ఎస్సార్సీ అన్న పార్టీకి పట్టం కట్టామని, 2009లో అసలు రాష్ట్ర విభజన ప్రాస్తవన లేని పార్టీని గెలిపించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా రాష్ట్ర విభజనను అడ్డుకునే నాయకులకే అండగా నిలుస్తామని అశోక్బాబు స్పష్టంచేశారు. తమ ప్రాణాలైనా అర్పించి తెలంగాణా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదానికి రాకుండా అడ్డుకుంటామన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more