Venkaiah naidu promises development in bandar airport

venkaiah naidu, senior bjp leader m venkaiah naidu, venkaiah naidu promises development in coasta, bandar, machilipatnam, bandar airport, congress party, bjp, tdp, chandrababu naidu,

venkaiah naidu promises development in bandar airport

వెంకయ్యనాయుడు అభివ్రుద్ది ప్రకటనలు

Posted: 04/15/2013 06:12 PM IST
Venkaiah naidu promises development in bandar airport

బీజేపీ అధికారంలోకి రాగానే మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని బీపేజీ జాతీయనేత రాజ్యసభ సభ్యులు ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ప్రజా చైతన్య స దస్సు కార్యక్రమం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీవైపు ప్రజలు చూస్తున్నారని అధికారంలోకి వస్తే ఎవరు అడ్డుపడినా పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు ఆగవన్నారు. కులాలను, మతాలను అభివృద్ధి చేసేది బీజేపీ ఒక్కటేనని. వ్యవసాయానికి 60 శాతం నీరు ఇచ్చి రైతులకు చేయూత నిచ్చి స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పినట్లుగా బీజేపీ చేస్తుంది. తాగునీరు, విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌. ఛత్తీస్‌ఘడ్‌, గోవా రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కాశ్మీర్‌ భారతదేశం అంతర్భాగమని బీజేపీ మతమార్పిడులపై నిషేధం విధిస్తుందన్నారు. మతంపైన రిజర్వేషన్లు ఉండకూడదని, భాజపా అధికారంలోకి వస్తే పాఠ్యపుస్తకాలలో మహానీయుల జీవితాన్ని విద్యార్ధులకు తెలియజేస్తుందన్నారు. వాజ్‌పాయ్‌ ప్రధాని అవ్వక ముందు అభివృద్ధి 4.1 శాతం ఉంటే అయిన తరువాత 10 శాతానికి పెరిగిందని, వాజ్‌పాయ్‌ 23 పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపితే ప్రస్తుత యుపిఏ పది పార్టీలతో అవస్తలు పడుతుందన్నారు. రోజుకో పార్టీ యుపిఏ నుంచి తలాక్‌ తలాక్‌ అంటూ వెళ్ళిపోతున్నాయని, 3వ ఫ్రింట్‌ గురించి మాట్లాడుతూ ఫ్రెంట్‌ ఉండదు, టెంట్‌ ఉంటుందన్నారు. ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయి. 10 సీట్లు వస్తే చక్రం తిప్పుతానని చంద్రబాబు అంటున్నారని, చక్రం తిప్పడం తప్ప ప్రభుత్వం తిరగదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితం దుర్లభంగా ఉందని ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫల మైందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్‌ 14 గంటలు ఉండదని, గుజరాత్‌ 24 గంటలు ఉంటుంద న్నారు. వర్షాలు దయదలిస్తే కరెంట్‌ కోత ఉండదని మన సిఎం అనడం సిగ్గు చేటన్నారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, గుజరాత్‌ రాష్ట్రం సోలార్‌ వ్యవస్ధను ఉపయోగించుకుని ముందుకు వెళుతుందని, మనం మాత్రం సోలార్‌ వ్యవస్ధను ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. భాజపా అధికారంలోకి వస్తే గన్నవరం విమానాశ్రయాన్ని, మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more