సీమాంధ్రలో ఈరోజు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలపై సమైక్యాంధ్ర బంద్ ప్రభావం పడింది. అలిపిరి వద్ద వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక చేసేది లేక భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. తిరుమలలో కాలినడకన వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు అల్పాహారం, వసతి ఏర్పాట్లు చేస్తోంది. అలాగే తిరుమల ఘాట్ రోడ్లో కూడా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలకు వెళ్ళాల్సిన టీటీడీ సిబ్బంది కూడా అలిపిరి వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్రైవేట్ వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈరోజు బంద్ నిర్వహిస్తుండటంతో టీటీడీ తరపున ప్రత్యామ్నాయ రవాణా వసతి కల్పించలేమని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. తమ వద్ద 10 బస్సులే అందుబాటులో ఉన్నాయన్నారు. కొండపైన పనిచేసే ఉద్యోగులను తరలించడానికి ఆ బస్సులు వినియోగిస్తున్నామన్నారు. భక్తులను తరలించేందుకు సరిపడా వాహనాలు లేవన్నారు. ఈ విషయంలో తమకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని విష్ణునివాసం, రెండోసత్రం, అలిపిరి లింకు బస్టాండు వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానా వేస్తున్నామన్నారు. అక్కడ వేచి ఉండే భక్తులకు అల్పాహారం అందిస్తామన్నారు. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన బంద్తో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. ప్రస్తుతం అలిపిరి నుంచి తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాలు కూడా తిరుమలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో భక్తులు తిరుమలకు రావాలన్నా.. తిరుగు ప్రయాణానికి కాలిబాటలే శరణ్యమయ్యాయి. రైళ్లలో వచ్చే భక్తులు అలిపిరికి చేరడానికి కూడా ప్రైవేటు వాహనాలు లేవు. అంటే రైల్వే స్టేషన్ నుంచే తిరుమలకు నడక సాగించాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more