సమైక్య రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయకుండా.... మాటలతో సరిపెడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారు. నిలదీసినందుకు తమపై దాడులు చేస్తున్న నేతలకు ...జనం తగిన బుద్ధి చెబుతామంటున్నారు. సీమాంధ్రలో నేతలపై నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీ, టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. సమైక్య ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలోలక్ష గళ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చీర కట్టుకున్న ఫోటోతో టీటీడీ చైర్మెన్ కనుమూరి బాపిరాజు ఫ్లెక్సీ కూడా ఇందులో ఉంది. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు .. పదవిని వదలనుంటున్నాడనే క్యాప్షన్ దీనికిచ్చారు. ఈ విషయం తెలిసిన కనుమూరి వర్గానికి చెందిన డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు ఫ్లెక్సీ తొలగించాలని పట్టుబట్టారు. ఉద్యమంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత లేదని సమైక్యవాదులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఫ్లెక్సీ తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి దిగారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ.... ఫ్లెక్సీపై చెప్పులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు... సమైక్యవాదులను నెట్టి కనుమూరి ఫ్లెక్సీని లాక్కెళ్లారు.
రూ. 125 కోట్లతో
తిరుపతి విమానాశ్రయాన్ని 125 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు కేంద్ర విమానయానా శాఖ మంత్రి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. ఆయన ఈరోజు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓనం పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more