సమైక్యవాదానికి... వేర్పాటు వాదానికి మధ్య జరుగుతున్న పోరాటం అని విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తిరుపతిలో బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. రాయలసీమ నుండి ఈ యాత్ర ప్రారంభించి రాష్ట్రమంతా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇది ఏప్రాంతానికి వ్యతిరేకంగా పోరాటం జరపటం లేదని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొన్ని పార్టీలు స్వార్ధ పూరితంగా కుట్ర చేశారని... ఆ కుట్రలను తిప్పి కొట్టేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతిని విడదీస్తే భారత జాతికే ప్రమాదం అని గుర్తించాలని ఆయన కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రతి రోజూ ఒక గంట దీక్ష చేయాలని కోరారు. జై విశాలంధ్ర, రాష్ట్ర విభజనను అడ్డుకుంటా... అడ్డుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ యాత్ర రాజకీయ నాయకులకు అతీతంగా యాత్ర సాగుతుందని, సాధారణ ప్రజలతో, సంకల్ప శుద్ధితో ఉద్యమం చేపడతామని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజన చేయడం లేదని ప్రకటన వచ్చే వరకు పోరాటం సాగిస్తామని తెలిపారు.
అయితే సమైక్యాంధ్రను కోరుతూ చిత్తూరులో గత ఆరు రోజులు గా ఎమ్మెల్యే సీకే బాబు చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయనను తీసుకెళ్తున్న అంబులెన్స్ వాహనాన్ని అడ్డుకోవడానికి ఆందోళనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిరసనగా వాహనాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన బిపి పూర్తిగా డౌన్ అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా సీకే బాబు దీక్షను భగ్నం చేయడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more