టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్, కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద, తిరుపతి లీలామహల్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడినప్పటికీ దైవదర్శనం తరువాతే మాట్లాడతానంటూ ప్రజలకు అభివాదం చేస్తూ బాబు వెళ్లిపోయారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం వద్ద నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో నాయకులు స్వాగతం పలికి తండ్రీ కొడుకులను గజమాలతో సత్కరించారు.
రాత్రి 7.00గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బాబుకు స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు అక్కడ నుండి టి ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సుమారు 500 మోటార్సైకిళ్లతో ర్యాలీగా బాబు వాహనానికి ముందు కదిలారు. శంకరం బాడి సుందరాచారి విగ్రహం ముందు మహిళలు మంగళహారతులు పట్టారు. గుమ్మడి కాయలతో దిష్టితీశా రు. అక్కడినుంచి బయలుదేరిన మోటార్సైకిల్ ర్యాలీ రామానుజం సర్కిల్ మీదుగా పూర్ణకుంభం, శ్రీనివాసం, లీలామహల్ సర్కిళ్ల మీదుగా సాగింది. లీలామహల్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలకు ఆయన కారులోనుంచే అభివాదం చేశారు. అక్కడ నుండి సుమారు 8.40గంటలకు ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకున్నారు. తిరుమలలో టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజామున స్వామివారి సు ప్రభాత సేవలో బాబు కుటుంబంతో కలసి పాల్గొంటారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more