తిరుమలలో భక్తులు సౌకర్యార్థం నారాయణగిరి అతిథిభవనాల ప్రాంతంలో టిటిడి నిర్మించిన నారాయణగిరి అతిథిగృహం-4ను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. 4.18కోట్ల వ్యయంతో నిర్మించిన అతిథిగృహం 27.147 అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం ఐదు అంతస్థుల్లో నిర్మించిన ఈ అతిథిగృహంలో 30గదులు ఉన్నాయి. ఇందులో ప్రతిరోజు 150 భక్తులు బసచేసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇందులో భక్తుల సౌకర్యార్థం ఒక లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారు.
కాగా ఈ అతిథిగృహం ఎస్వీ రెస్ట్ హౌస్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలో ఉండడం భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని భక్తుల దాహార్తిని తీర్చేందుకు టిటిడి 15కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన తెలుగుగంగ పథకం పైప్లైప్కు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. 15కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తలపెట్టిన ఈ పైప్లైన్ ద్వారా తిరుమలకు 5 ఎంఎల్డి, తిరుపతికి ఐదు ఎంఎల్డి నీరు సరఫరా అవుతుంది.
కాగా తిరుపతిలోని టిటిడి ఇన్స్టిట్యూషన్స్, స్థానిక ఆలయాలు, స్విమ్స్, పరిపాలనా భవనం, టిటిడి విద్యాసంస్థలు, టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్ కు నీటిని వినియోగించనున్నారు. ఈ నీటిని తరలించేందుకు 150హెచ్పి సామర్థ్యం కలిగిన మూడు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పంప్రూమ్స్, జనరేటర్, యార్డ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
అలాగే ధర్మగిరి వేదపాఠశాలలో వేదపండితుల కోసం 3.4కోట్లతో నిర్మించతలపెట్టిన నాలుగు క్వార్టర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. 13.672 చదరపు అడుగుల స్థలంలో ఒక్క ఫ్లోర్లో 16కుటుంబాలు నివాసం ఉండేందుకు వీలుగా నాలుగు బ్లాక్లలో 16 క్వార్టర్స్ నిర్మించనున్నారు. ఇందులో ఒక్కో క్వార్టర్లో ఒక బెడ్రూమ్, డైనింగ్రూమ్, లివింగ్రూమ్, పూజాగది, కిచెన్ అండ్ టాయిలెట్ ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రపై తెలుగులో, శ్రీవారి ఆలయంలోని శాసనాల్లో పేర్కొని ఉన్న ఆలయ చరిత్రతో ఇంగ్లీష్లో రూపొందించిన కరపత్రాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more