ఓర్చా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఈ ప్రదేశం.. చారిత్రాత్మకమైంది. ఈ ప్రదేశాన్ని మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ స్థాపించాడు. ఆయనే దీనికి మొదటి రాజు కూడా. ఇక్కడ కల నిర్మాణాలు అద్భుత ఆకర్షణలుగా నిలిచాయి. వాటిలో రాజ మహల్, రాణి మహల్, సుందర్ మహల్, లక్ష్మి నారాయణ ఆలయం తప్పనిసరిగా చూడాల్సినవి.