ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉన్నపుడు, తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడు ప్రసాద్ ఇద్దరికీ సన్నిహితంగానే ఉన్నారు. ఆయన అందరితో సన్నిహితంగా ఉంటూ రాజకీయ ‘మాంత్రిక్’గా అయ్యారు. అధికారంలో ఉన్న ఏ పార్టీకి, ముఖ్యమంత్రికయినా సన్నిహితంగా ఉండే నిమ్మగడ్డ ప్రసాద్ను ఆ పేరుతో కన్నా మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటేనే అందరూ గుర్తు పడతారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రసాద్పై ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ ప్రసాద్ అన్నంత వరకు ఆయన మీద ఆరోపణలు చేశారు. కానీ అదే వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్కు సన్నిహితంగా ఉండేవారు. పారిశ్రామిక వేత్తగా పేరొందిన నిమ్మగడ్డ ప్రసాద్ అదే స్థాయిలో రాజకీయ పలుకుబడి సాధించి పేరు గడించారు.
వైఎస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ రాజకీయ పలుకుబడితో పారిశ్రామిక రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1961 అక్టోబర్ 11న కృష్ణా జిల్లాల్లో జన్మించిన నిమ్మగడ్డ ప్రసాద్ బాబూ జగ్జీవన్రామ్ కళాశాలలో బిఎస్సీ డిగ్రీ, అనంతరం ఢిల్లీ యూనివర్శిటీలో ఎంఎస్సి చదివారు. ఘజియాబాద్ ఐఎంటి నుంచి మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా పొందారు. 2003 నుంచి ఫార్మా రంగంలో అడుగుపెట్టి మెడికార్పో టెక్నాలజీస్ను తీసుకుని అంచలంచెలుగా ఎదిగి 2006లో యుఎస్ఏకి చెందిన మైలాన్ ల్యాబొరేటరీని మ్యాట్రిక్స్ లాబ్స్తో కలిసి స్థాపించారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా పేరొందింది. అనంతరం 2008లో ప్రసాద్ వాన్పిక్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అనుభవం లేకపోయినప్పటికీ వాన్పిక్ సంస్థకు 15 వేల ఎకరాల భూమిని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు దృష్టిలో పెట్టుకునే వైఎస్తో నిమ్మగడ్డకు సంబంధాలు బలపడ్డాయని ప్రచారం జరిగింది. ఆయన వాన్పిక్కు, మాటివికి చైర్మన్గా, సాక్షి పత్రిక, టివి, భారతి సిమెంట్స్లో డైరక్టర్గా కొనసాగుతున్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. పారిశ్రామిక రంగంలో అనేక అవార్డులు పొందారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more