సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాని, 26 జీవోల నోటీసులను సభ ముందు ఉంచాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనమండలిలో పట్టుపట్టారు. దీంతో సభను మండలి ఛైర్మన్ చక్రపాణి సభను వాయిదా వేశారు. పదకొండు రోజుల విరామానంతరం వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాల అనంతరం టిడిపి పక్షనాయకులు దాడి వీరభద్రరావు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆరుగురు మంత్రులు రాజీనామా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రసంగిస్తుండగానే టిడిపి సభ్యులు నన్నపనేని రాజకుమారి, వెంకట సతీష్రెడ్డి, పి.యాదగిరి వెల్లోకి దూసుకువచ్చి సభా కార్యకలపాలకు అంతరాయం కలిగించడంతో మండలి ఛైర్మన్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభంకాగానే మళ్లీ దాడి మాట్లాడుతూ ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఎఎస్ అధికారులు రాజీనామా చేయాలని పట్టుపట్టారు. దాడికి సంఘీభావంగా సభ్యులు నన్నపనేని రాజకుమారి, పి.యాదగిరి, వెంకట సతీష్రెడ్డి మళ్లీ వెల్ వద్దకు దూసుకొచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకొని సభ్యులు తమ తమ సీట్లల్లో కూర్చోవాలని పలుమార్లు విన్నవించినప్పటికీ వినకుండా నిరసన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more