ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రీడలపోటీల్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుల మధ్య ఇంతవరకు ఎటువంటి విభేదాలు ఏర్పడలేదు. ఆమధ్య సింధు, సైనా తనకు మంచి ఫ్రెండ్ కాదని పేర్కొన్న విషయం తెలిసిందే కానీ.. దానిమీద సైనా మాత్రం ఏమీ స్పందించలేదు. దీంతో సింధు కామెంట్లు పెద్దగా సంచలనమేమీ సృష్టించలేదు. మొన్న జరిగిన డెన్మార్క్ లోనూ వీరిద్దరు కలిసి బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొన్నారు కూడా! దీంతో వీరిమధ్య తగాదాలు లేవంటూ తేలిపోయింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగానీ.. వీరిద్దరి తీవ్రమైన గొడవ జరుగుతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారతీయ అభిమానులందరినీ ఆ గొడవ విషయం ఆశ్చర్యపరుస్తోంది కూడా!
అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా ఏ పతకాలు సాధించకుండానే క్వార్టర్స్ లో నుంచి వెనుదిరిగిన సైనా, సింధులు మరో సూపర్ సిరీస్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ఆరంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పోటీల్లో వీరిద్దరు రసవత్తరమైన ఆటను ప్రదర్శించడం ఖాయమంటూ యాజమాన్యం భావిస్తోంది. ఈ టోర్నీలో అన్నీ అనుకున్నట్లుగా జరిగిగే.. సెమీఫైనల్లో ఒక ఆసక్తికరమైన పోరును భారతీయ అభిమానులు చూడవచ్చునని యాజమాన్యం తెలుపుతోంది. సైనా, సింధు ఇద్దరూ తమ ప్రత్యర్థులు దాటుకుంటూ సెమీస్ కు చేరితే.. అక్కడ ఒకరితో ఒకరు తలపడవచ్చు.
ఐదో సీడ్ గా బరిలోకి దిగుతున్న సైనా తొలి రౌండ్లో ఫ్రాన్స్ కు చెందిన నషినా వారన్ తో ఢీకొనబోతుండగా.. ఎనిమిదో సీడ్ సింధు థాయ్ లాండ్ అగ్రక్రీడాకారిణి పొర్న్ టివ్ బురానాప్రసెర్ట్ సక్ ను ఎదుర్కోనుంది. ఇలా ఒక్కొక్కరు ప్రత్యర్థులను బారత బ్యాడ్మింటన్ స్టార్లు దాటుకుంటూ సెమీఫైనల్ లో చేరిపోతే... ఆ పోటీల్లో వీరిద్దరు తలపడవచ్చు. భారత్ బ్యాడ్మింటన్ స్టార్స్ అయిన సైనా, సింధులు సెమీ ఫైనల్లో ఒకర్నొకరు తలపడే అవకాశాలు వుండటంతో ఆ మ్యాచ్ భారతీయ అభిమానులకు చాలా ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా.. ఫైనల్ కు వెళ్లినవారు ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలిచినా పతకం దక్కేది భారత్ కే కదా అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఇక పురుషుల విభాగంలో సింగిల్స్ లో కశ్యప్ తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 4 కెనిచి టాగోతో తలపడనున్నాడు. శ్రీకాంత్ కు క్వాలిఫయర్ ఎదురుపడనుండగా.. గురుసాయిదత్ కు ప్రపంచ నె.8 హుయున్ సవాలు విసరబోతున్నాడు. అలాగే మహిళల డబుల్స్ లో జ్వాల, అశ్వినీ జోడి... పురుషుల డబుల్స్ లో సుమీత్, మను బరిలోకి దిగనున్నారు. మరి ఈసారైనా భారతీయ ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో పతకాలు సాధిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more