సాధారణంగా ఏదైనా క్రీడలో ఒక జట్టు గెలిచిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లందరూ మైదానంలోనే సంబరాలు చేసుకోవడం సర్వసాధారణం! గల్లీల ఆటగాళ్లనుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లందరూ గెలిచిన తర్వాత తీరు ఇలాగే వుంటుంది. అయితే మిగతా క్రీడలతో పోల్చుకుంటే.. ఫుల్ బాల్ లో గోల్ వేసిన తర్వాత ఆటగాళ్లు మరీ ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు. ఎవడైనా గోల్ వేస్తే చాలు.. అతనిని నేలమీద పడుకోబెట్టి మిగతా ఆటగాళ్లందరూ అతనిమీద పడి దొర్లుతుంటారు. అతడు చచ్చాడా..? బతికున్నాడా..? అన్నది కాదు ముఖ్యం.. అతడి మీద పడి సంబరాల పేరుతో పొలాన్ని దున్నినట్టు దున్నేయడమే! అయితే అటువంటి సంబరమే ఒక నిండు ప్రాణాలను బలితీసుకుంది... తీరని విషాదాన్ని మిగిల్చింది.
మిజోరాం ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో భాగంగా బెత్లెహామ్ వెంగ్తలాంగ్ ఎఫ్సీ జట్టు తరఫున ఆడుతున్న పీటర్ బయాక్సంగ్జువాలా... తన ప్రతిభతో అద్భుతమైన గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేశాడు. జట్టు ఓడిపోతున్న తరుణంలో ఇతడు గోల్ వేయడంతో ఇతడితోపాటు ఇతర ఆటగాళ్లందరూ అంతుపట్టలేని ఆనందంలో మునిగిపోయారు. మొదట గోల్ వేసిన అనంతరం ఆనందంతో ఊగిపోతూ తలకిందులుగా ఎగిరి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఈ 23 ఏళ్ల పీటర్... ఆ సమయంలోనే అనుకోకుండా తల నేరుగా నేలకు బలంగా తాకి పడిపోయాడు. దీంతో అతడి వెన్ను పూర్తిగా దెబ్బతింది. అప్పటికే ఇతడు స్పృహ కోల్పోయాడు. అయితే ఇతనికి జరిగిన ఈ విషాదాన్ని అక్కడ ఎవ్వరూ గమనించలేకపోయారు.
పైగా అతడు కిందపడిన సమయంలో ఇతర ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అతడిపై పడిపోయారు. అతనికి ఏం జరిగిందో, లేదోనన్న విషయం తెలుసుకోకుండా ఒకరిమీద ఒకరు పడిపోయారు. అలా పడిపోయిన అనంతరం ఒక్కొక్కరు పైకి లేస్తున్న తరుణంలో అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అతనికేమో జరిగిందని అందరూ భావించారు. తరువాత జరిగిన విషయాన్ని గమనించిన యాజమాన్యం.. వెంటనే అతనిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఫలితం మాత్రం దక్కలేదు... ఆదివారం అతడు ప్రాణాలు కోల్పోయాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more