ఆసియా గే్మ్స్ భారత్ కు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. మనవారి అత్యుత్తమ ప్రతిభతో దూసుకెళ్తున్నారు. స్వ్కాష్, టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ ఇలా ప్రతి ఆటలోనూ మనవారు ముందుంటున్నారు. గత కాలపు చెప్పుకోలేని పతకలా సంఖ్యను ఈ సారి ఖచ్చితంగా పెంచుతారని విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు సాధించిన పతకాలను చూస్తే ఇది స్పష్టం అవుతోంది. కొన్నాళ్ళుగా ప్రపంచ వేదికలపై భారత్ పేలవమైన పోటి ఇస్తున్న నేపథ్యంలో ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తా చాటే అవకాశం వచ్చింది.
50 మీటర్ల పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన జీతూ రాయ్.. మరో పతకం సాధించాడు. పది మీటర్ల టీం షూటింగ్ విభాగంలో భారత షూటర్లు కాంస్య పతకం సాధించారు. జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాష్ నంజప్పా లతో కూడిన టీం ఫైనల్లోమూడవ స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా జీతూ రెండవ పతకం పొందాడు. అటు తొలిరోజే మహిళల సింగిల్స్ 10మీటర్ల షూటింగ్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యం సాధించి పతకాల ఖాతాను తెరిచింది.
ఇక టెన్నిస్ లో కూడా మనవారు సత్తా చాటారు. మెన్స్ సింగిల్స్ లో యూకీ బాంబ్రి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ లో నేపాలి ఆటగాడు జితేంద్ర పరియార్ పై బాంబ్రీ 6-0, 6-0 తేడాతో కనీసం కౌంట్ తెరవనీయకుండా చిత్తు చేశాడు. ఇక మరొక మ్యాచ్ లో అభిషేక్ బస్టోలా పై సనమ్ సింగ్ విజయం సాధించాడు. 6-0, 6-1 సెట్ల తేడాతో సనమ్ గెలుపొందాడు. విశేషం ఏమిటంటే ఇక్కడ కూడా ప్రత్యర్ధి అభిషేక్ నేపాలి కావటం అంతేకాకుండా అతను కూడా రెండు సెట్లలో కలిపి ఒక పాయింట్ కంటే ఎక్కువ గెలవలేకపోవటం. అటు మహిళల బ్యాడ్మింటన్ లో కూడా మన అమ్మాయిలు మంచి ప్రతిభ కనబర్చారు. కాకపోతే అక్కడక్కడా తడబడ్డారు.
స్క్వాష్ లో దీపికా పల్లికల్ పతకాన్ని రిజర్వు చేసి పెట్టింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో దీపిక దూసుకెళ్ళింది. అటు టాప్ సీడ్ గా ఉన్న సౌరవ్ గోషాల్ కూడా పతకం ఖచ్చితంగా వచ్చేలా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ఏ పతకం వస్తుంది అనేది ఫైనల్ లో వీరి ప్రతిభ ఆధారంగా తెలుస్తుంది. ఇలా ప్రతి ఆటలోనూ భారతీయ ప్లేయర్లు, అథ్లెట్లు ప్రతిభ చూపిస్తూ.. పతకాలను తీసుకొస్తున్నారు. ఇది భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఇండియా అంటే క్రికెట్ తప్ప మరొకటి తెలియదు అనే పేరు నానిపోయిన ప్రపంచం నాలుకలో ఇప్పుడు భారత్ అంటే అన్ని ఆటలకు అడ్డాగా నిలుస్తుందని మాటలు వస్తాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more