ఆసియా క్రీడల్లో మన భారతదేశం తరఫునుంచి పలు విభాగాల్లో పాల్గొన్న మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కొన్ని క్రీడల్లో పురుషులు ఇంటిదారి పడుతున్నప్పటికీ మహిళలు మాత్రం ఓటమిని అంగీకరించకుండా దేశ గౌరవాన్ని కాపాడటంలో సఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్క్వాష్, పిస్టల్ ఈవెంట్ లో పాల్గొన్న మన భారతీయ మహిళలు స్వర్ణంతో వెలగకపోయినా.. కాంస్యంతోనే ఇంటిదీపం ఆరకుండా గౌరవాన్ని నిలబెట్టగలిగారు. తాము ఆశించిన విజయాన్ని అందకపోయినప్పటికీ... ఆశలు అడియాశలు కాకుండా తమనుతాము నిరూపించుకోవడంలో విజయం సాధించారు.
భారత స్క్వాష్ క్రీడాకారణి దీపికా పల్లికల్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం అందించి, దేశగౌరవాన్ని కాపాడుకోగలిగింది. మొదటినుంచి అద్భుతంగా ప్రదర్శిస్తూ అందిరినీ ముచ్చెమటలు పట్టించిన ఈ అమ్మడు.. చివరి నిముషంలో వెనుదిరిగి కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ప్రపంచ నెం.1 నికోల్ డేవిడ్ చేతిలో దీపికా ఓటమి చవిచూసింది. 25 నిముషాలపాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ప్రపంచంలో నెం.12 అయిన దీపిక 4-11,4-11,5-11 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆసియా క్రీడల్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కు లభించిన ఇదే తొలిపథకం.
ఇక పిస్టల్ టీమ్ ఈవెంట్ లో పాల్గొన్న ముగ్గురు మహిళలు హీనా, సర్నోబత్, అనీసాలు బాగానే ప్రదర్శించినప్పటికీ.. చివరికి కాంస్య పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా క్రీడల్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో ఒక్కొక్కరు కాంస్య పతకాలను సాధించి తమతమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో మన ఇండియాకు ఒకేసారి మూడు కాంస్య పతకాలు లభించాయి. మొదట్లో అందరినీ చమత్కరిస్తూ చివరిదాకా వచ్చిన ఈ ముగ్గురు.. తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూసి స్వర్ణాన్ని పొందలేకపోయారు. ఏదేమైనా.. ఆసియా క్రీడల్లో మహిళలు తమతమ ప్రతిభతో కాంస్యంతోనైనా భారత గౌరవాన్ని నిలబెట్టడంలో బాగానే పోరాడుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more