ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్ 38.3 సగటుతో 14 మ్యాచుల్లో పంజాబ్ తరపున 460 పరుగులు చేశాడు. జట్టు మొత్తం ప్లేఆఫ్స్ కు వెళ్లకపోయినా తన కుమారుడు మాత్రం ఆటలో చక్కగా రాణించాడని ఆయన తండ్రి అనుకోలేదు. పంజాబ్ జట్టు నాకౌట్ దశకు చేరకపోవడంతో ధావన్ తండ్రి సీరియస్ అయ్యాడు. ధావన్ ను చితక్కోట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలో ధావన్ను అతని తండ్రి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. కిందపడిన థామన్ ను తన కాలితోనూ తంతున్నట్లు కనిపించింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్లు ధావన్ తండ్రిని అడ్డుకుంటున్నట్లు ఆ వీడియోలో చూపించారు. అయితే ఎప్పుడు సరదా వీడియోలు పోస్టు చేసే ధావన్ ఈసారి కూడా ఇలా తన అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. తమ జట్టు నాకౌట్ దశకు క్వాలిఫై కాలేదని తమ తండ్రి ఇలా కొడుతున్నారని తన వీడియోకు ధావన్ ఓ ట్యాగ్ పోస్టు చేశాడు. సరదగా సాగిన ఆ వీడియోకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్, పంజాబ్ టీమ్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్ రియాక్ట్ అయ్యారు. ఈసారి ఐపీఎల్ జాబితాలో పంజాబ్ జట్టు ఆరవ స్థానంలో ఉంది.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more