దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో ముగియగానే కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వచ్చాయి. ఆయన బ్యాట్స్మెన్ గానే కాకుండా.. సారధిగా కూడా విఫలమయ్యాడని నెట్ జనులు విరుచుకుపడ్డారు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు మరో పంథాలో విమర్శలను టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సహా దీపక్ చాహర్ పైకి మళ్లించి.. తమ విమర్శల జడిని కొనసాగించారు. దీంతో నెట్టింట్లో దీపక్ చాహర్ ను కోహ్లీ అభిమానులు ఆటాడుకుంటున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని జట్టు ఓటమికి సగం కారణమైన విరాట్ కోహ్లీ.. డీఆర్ఎస్ నిర్ణయంలోనూ బౌలర్, కీపర్ చెప్పింది విని ఫెయిలయ్యాడు. డీఆర్ఎస్ విఫలమైన క్షణంలో చిన్నస్వామి స్టేడియంలో వినిపించిన ఏకైన పేరు ధోని. మహేంద్రుడు లేకపోతే డీఆర్ఎస్లో కోహ్లీ విజయవంతం కాలేడనే ఇటీవలే గౌతమ్ గంభీర్ చేసిన అపవాదే నిజమైంది. ఎలా అంటే.. బెంగుళూరు టీ20లో ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ నకుల్ బాల్ ఇందుకు కారణమైంది.
అదెలా అంటే చాహర్ వేసిన బంతి.. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆర్. హెండ్రిక్స్ ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్కి అందని బంతి నేరుగా వెళ్లి అతని ఫ్యాడ్స్ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే.. బంతి వికెట్లకి తాకేలా వెళ్లిందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించిన దీపక్ చాహర్.. డీఆర్ఎస్ కోరేలా చేశాడు. రిప్లైలో బంతి లెగ్ స్టంప్ లైన్ పడి వికెట్లకి చాలా దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో.. విరాట్ కోహ్లీ సిగ్గుతో తన ముఖాన్ని క్యాప్తో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.
దీంతో.. విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తడం వాటితో మండిపడ్డ సారధి ఫాన్స్.. దీపక్ చాహర్ పై ఓ రేంజ్ లో అగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట్లో ఫైర్ కావడం కనిపించింది. కోహ్లీని డీఆర్ఎస్ కోరేలా బలవంతంగా ఒప్పించి.. అవమానించావంటూ మండిపడుతున్నారు. సఫారీలతో మ్యాచ్ లలో భారత్ జట్టుకి ధోనీ దూరంగా ఉండగా.. రిషబ్ పంత్ కీపర్గా ఉన్నాడు. ధోనీ తరహాలో పంత్ కచ్చితమైన అభిప్రాయం చెప్పలేకపోతుండటంతో.. బౌలర్తో మాట్లాడిన తర్వాత కోహ్లీ డీఆర్ఎస్ అడిగేస్తున్నాడు. కానీ.. ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more