భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ గా రాణించిన ఓపెనర్ బ్యాట్స్ మెన్ మాధవ్ ఆప్టే ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు.
భారత క్రికెట్ జట్టు తరపున ఏడు టెస్టు మ్యాచులు ఆడిన అప్టే అటు ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా రాణించడంతో పాటు లెగ్ స్పిన్నర్ గా కూడా తన సేవలను అందించారు. పాకిస్థాన్ తో 1952లో జరగిన మ్యాచ్ తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన అప్టే మెత్తంగా 542 పరుగులను అంతర్జాతీయ వేదికలపై నమోదు చేశారు. మొత్తంగా 13 ఇన్నింగ్స్ అడిన అప్టే ఒక శతకం తో పాటు మూడు అర్థశతకాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు. మరోవైపు ఇటు రంజీ వేదికలపై కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. 1958-59, 1961-62లలో రెండు పర్యాయాలు ముంబై జట్టు రంజీ టైటిల్ ను సాధించి పెట్టడంలో ఆయన పాత్ర కీలకమైనదే. ఈ కుడిచేతి వాటం గల బ్యాట్స్ మెన్ మొత్తంమీద 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆయన 3,336 పరుగులు చేశారు.
లెగ్ స్పిన్నర్ గా తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన ఆప్టే.. విన్నూ మన్ ఖద్ సహకారంతో ఓపెనర్ బ్యాడ్స్ మెన్ గా కూడా రాణించి తన సత్తాను చాటారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన అప్పట్లో 165 పరుగల అత్యధిక స్కోరును కూడా నమోదు చేసుకున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు. మాధవ్ ఆప్టే మృతికి బీసీసీఐతో పాటు, పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more