ఐపీఎల్ 2019 సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు.? అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసా.? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కు ఆరేంజ్ క్యాప్ ను.. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారు. అయితే ఐపీఎల్ 12వ సీజన్ లో వీటిని దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో మాత్రం మనవాళ్లు లేకపోవడం కొసమెరుపు.
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించాడు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసమని ప్లే ఆఫ్ మ్యాచ్లకు ముందే ఐపీఎల్కు దూరమయ్యాడు. ఆ తర్వాత వరుసలో 14 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 593పరుగులతో నిలిచాడు. దీంతో కేఎల్ రాహుల్ మోస్ట్ సైలిష్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పర్పుల్ క్యాప్తో ముగించాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్లో 2వికెట్లు తీసి సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా ఘనత సాధించాడు. ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ 2వికెట్లు తాహిర్ చేతికి చిక్కాయి. 40ఏళ్ల ఇమ్రాన్ 17మ్యాచ్ల్లో 26వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత వరసలో కగిసో రబాడ 25వికెట్లు తీసి రెండో ప్లేయర్గా నిలిచాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more