టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు అందుకునేందుకు చేరువయ్యాడు. భారత్ తరఫున ఈ రికార్డును ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే అందుకోగలిగారు. ఏమిటా రికార్డు అంటే.. టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కలిపి 500లు, ఆపైన మ్యాచ్లు ఆడటం. ప్రస్తుతం ధోనీ 497 (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) మ్యాచ్ లతో ఉన్నాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్ తో రెండు టీ20లు, ఇంగ్లాండ్తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు.
ఈ ఎనిమిది మ్యాచుల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఆడిన మ్యాచుల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్ తో రెండు టీ20లతో పాటు జులై 3న ఇంగ్లాండ్తో టీ20 ఆడనున్నాడు. ఈ మూడు మ్యాచ్లు ఆడితే ధోనీ 500 మ్యాచుల క్లబ్లో చేరనున్నాడు. కాగా, మాస్టార్ బ్లాస్టర్ సచిన టెండుల్కర్ 664 (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1) మ్యాచులతో అగ్రస్థానంలో వున్నాడు. ఆ తరువాతి స్థానంలో రాహుల్ ధ్రావిడ్ 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు.
కాగా, ధోని ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల ద్వారా వారి రికార్డులకు చేరువ కానున్నాడు. అయితే త్వరలో ధోనీ భారత్ తరఫున 500 మ్యాచులు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇక ఈ ఏడాది సెప్టెంబరులో భారత్ ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీలో ధోనీ ఆడితే ద్రవిడ్ రికార్డును బద్దులకొట్టే అవకాశం ఉంది. అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చుకున్నా సచిన్దే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే(652) ఉన్నాడు. కుమార సంగాక్కర (594) మూడో స్థానంలో ఉండగా.. మహేంద్ర సింగ్ ధోనీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more